హీరోయిన్స్ ప్రాధాన్యం ఉన్న మూవీల్లో నటించేందుకు హీరోలు వెనకడుగు వేస్తున్నారని హీరోయిన్ తాప్సీ చెప్పింది. ఒకప్పుడు తాను కలిసి నటించిన ఓ స్టార్ హీరో, కథలో హీరోయిన్ పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఉందని అభద్రతా భావంతో ప్రాజెక్టును తిరస్కరించాడని తెలిపింది. సీనియర్లే కాకుండా, కొత్త హీరోలూ క్రెడిట్ మొత్తం హీరోయిన్కే దక్కుతుందనే భయంతో ఇలాంటి మూవీలకు దూరంగా ఉంటున్నారని పేర్కొంది.
PLD: అమరావతిలో 58 అడుగుల పొట్టిశ్రీరాములు కాంస్య విగ్రహం నిర్మాణానికి 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ ఉపయోగించారు. మూడు అంతస్తుల బేస్పై నిర్మించిన ఈ విగ్రహానికి సుమారు రూ. 25 కోట్లు ఖర్చు చేశారు. పొట్టిశ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సమీకరించిన నిధులతో నిర్మాణం జరుగుతోందని తెలిపారు.
KMR: జుక్కల్ MLA లక్ష్మీకాంతారావుకు AICC కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్రలో DCC అధ్యక్షుల ఎంపిక కోసం ఆయనను పరిశీలకుడిగా నియమించింది. ‘సంఘటన్ సృజన్ అభియాన్’లో భాగంగా ఈ నియామకం జరిగింది. MLA మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, AICC అధ్యక్షుడు ఖర్గే, PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లకు ధన్యవాదాలు తెలిపారు.
JN: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. కొడకండ్ల ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని, పాలకుర్తి నియోజకవర్గంలో వైద్యరంగ బలోపేతానికి సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. వైద్యరంగ బలోపేతానికి ప్రజాప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే చెప్పారు.
WGL: నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ సేవలు సరిగా అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రక్తం, మూత్ర పరీక్షలు తదితర సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని బంధువులు తెలిపారు. దీంతో వైద్య అధికారులు స్పందించి ల్యాబ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి రోగులకు న్యాయం చేయాలని కోరారు.
TG: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారంపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. 2028లో ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, 2029లోనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఢిల్లీలో చిట్చాట్లో మాట్లాడుతూ.. రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తే అది ఆహ్వానించదగ్గ పరిణామమేనని అభిప్రాయపడ్డారు. ఎన్నికల షెడ్యూల్ విషయంలో వస్తున్న ఊహాగానాలకు తన వ్యాఖ్యలతో సీఎం తెరదించారు.
TG: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారంపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. 2028లో ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, 2029లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. ఢిల్లీలో చిట్చాట్లో మాట్లాడుతూ.. రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తే అది ఆహ్వానించదగ్గ పరిణామమేనని అభిప్రాయపడ్డారు. కాగా, ఎన్నికల షెడ్యూల్ విషయంలో వస్తున్న ఊహాగానాలకు తన వ్యాఖ్యలతో సీఎం తెరదించారు.
WGL: రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో వాహనాదారులు అప్రమత్తంగా ఉండాలని WGL CP సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఇవాళ WGL కమిషనర్ కార్యాలయంలో CP మాట్లాడుతూ.. వర్షాల సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు.
NLR: సోమశిల జలాశయం నీటి వివరాలను అధికారులు విడుదల చేశారు. బుధవారం ఎగువ ప్రాంతాల నుంచి 664 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందన్నారు. డ్యాం పూర్తి సామర్థ్యం 78 TMCలు కాగా జలాశయంలో 62.606 TMCల నీటిమట్టం నమోదైంది. పవర్ టన్నెల్ ద్వారా పెన్నా డెల్టాకు 600 క్యూసెక్కులు, NFCకు 650 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
NRML: దిలావర్పూర్ మండలంలోని సిర్గాపూర్ గ్రామంలో ఎంపీఓ గోవర్ధన్ గ్రామపంచాయతీ పనులను తనిఖీ చేశారు. పారిశుధ్యం, తాగునీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. సిబ్బంది పనితీరుపై సూచనలు చేస్తూ, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామంలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు.
BHPL: BCలను అవమానిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తక్షణమే తొలగించాలని BHPL BC సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇవాళ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను తొలగించి జగ్గారెడ్డికి పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి మాట్లాడటం బీసీల పట్ల వ్యతిరేకతను చూపుతుందన్నారు.
TPT: సూళ్లూరుపేటలో వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆర్డీవో జెండా ఊపి ప్రారంభించారు. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 40% పైగా వికలాంగులకు ఈ సదుపాయం కల్పించింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి, ఎంపీడీవో మురళి, డిపో మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు ఈ పథకం వికలాంగులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
KMM: భారతదేశపు తొలి సంపాదకులు, విలేకరుల చిత్రపటాల ఆవిష్కరణ కార్యక్రమం ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఘనంగా బుధవారం నిర్వహించారు. టిడబ్ల్యూజెఎఫ్ (హెచ్ 2843) ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై చిత్రపటాలను ఆవిష్కరించారు.
KMM: కామేపల్లి మండలం కొత్త లింగాలలోని శ్రీ కోట మైసమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమాన్ని రేపు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభిస్తారని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, సర్పంచ్ శ్రీనివాస్ ఇవాళ ప్రకటించారు. వారితోపాటు తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ & రైతు కమిషన్ సభ్యులు రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి పాల్గొంటారని వెల్లడించారు.
TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. ఢిల్లీలో చిట్చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టా మహేష్కు స్టేషన్ బెయిల్ రావడం వెనుక ప్రభుత్వ ప్రమేయం లేదన్నారు. పోలీసులు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నారని, డ్రగ్స్ నియంత్రణలో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. దోషులను వదిలిపెట్టేది లేదని ధీమా వ్యక్తం చేశారు.