• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వేణు గోపాలస్వామి గుట్టపై గుప్త నిధుల కోసం తవ్వకాలు

RR: కేశంపేట మండలం వేములనర్వ గ్రామ శివారులోని వేణు గోపాల స్వామి గుట్టపై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత 2 రోజులుగా గుట్టపై జరుగుతున్న తవ్వకాలపై విస్తృత చర్చ జరుగుతున్న అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుట్టపై అక్రమ తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

March 18, 2026 / 05:34 PM IST

తగ్గిన పత్తి విక్రయాలు

KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 8 వాహనాల్లో 75 క్వింటాళ్ల విడిపత్తిని రైతులు తీసుకువచ్చారు. గరిష్ఠంగా క్వింటాకు రూ. 7,500, కనిష్ఠంగా రూ. 7,200 ధరకు ప్రైవేట్ వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా పత్తిని కొనుగోలు చేశారు. నిన్నటి కంటే తాజాగా పత్తి గరిష్ఠ ధర రూ. 50 పెరిగింది. రైతులు నాణ్యత పాటించాలన్నారు.

March 18, 2026 / 05:34 PM IST

పమిడిపాడులో పశువులకు టీకాల పంపిణీ

PLD: నరసరావుపేట (మం) పమిడిపాడులోని పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే చదలవాడ ప్రారంభించారు. జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం కింద పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు అందించి, గర్భకోశ సంబంధిత వ్యాధులకు చికిత్సలు చేశారు.

March 18, 2026 / 05:30 PM IST

అమెరికా సామ్రాజ్యవాద యుద్ధాన్ని ఖండిస్తున్నాం: ప్రజాసంఘాలు

MBNR: అమెరికా చేస్తున్న సామ్రాజ్యవాద యుద్ధాన్ని ఖండిస్తున్నామని ప్రజాసంఘాల నాయకులు విమర్శించారు. ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈనెల 22వ తేదీన ఆర్అండ్‌బీ అతిథి గృహం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించాలని తీర్మానించారు. పాలస్తీనా ఇరాన్‌లపై, ఇజ్రాయిల్ అమెరికా దాడులు మంచిది కాదన్నారు.

March 18, 2026 / 05:30 PM IST

‘కోమటిరెడ్డి అహంకారపూరిత వ్యాఖ్యలు మానుకో’

MBNR: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అహంకారపూరిత  వ్యాఖ్యలు మానుకోవాలని బీసీ మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పీసీసీ పదవి జగ్గారెడ్డికిస్తే 100 స్థానాల్లో గెలుస్తామని అనడం సిగ్గుచేటు అన్నారు. ముందు మీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

March 18, 2026 / 05:30 PM IST

పనుల రద్దుపై రేవంత్ సమాధానం చెప్పాలి: బీఆర్ఎస్

SDPT: జిల్లాలో గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 1070 కోట్ల అభివృద్ధి పనులను రద్దు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సిద్దిపేటలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ.. అభివృద్ధి పనులను రద్దు చేసి సిద్దిపేట ప్రజలను వంచించడం తగదన్నారు.

March 18, 2026 / 05:30 PM IST

బాధితులకు అండగా భరోసా సెంటర్: అదనపు ఎస్పీ

MDK: లైంగిక వేధింపుల బాధితులకు భరోసా సెంటర్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్‌ను ఆయన సందర్శించి తనిఖీ నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు. పోక్సో కేసులు, లైంగిక వేధింపుల బాధితుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు.

March 18, 2026 / 05:30 PM IST

పెద్దకడబూరులో రైతన్న మీ కోసం కార్యక్రమం

KRNL: టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదేశాల మేరకు పెద్దకడబూరు గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ మీ సేవ ఆంజనేయులు, సొసైటీ డైరెక్టర్లు గోనుమాను నరసన్న, హనుమేష్, టీడీపీ నాయకులు దిట్టికాటి దేవేంద్రలు పాల్గొన్నారు. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి ప్రతి రైతుకు రూ. 20 వేలు అందజేశామని పేర్కొన్నారు. 

March 18, 2026 / 05:29 PM IST

అక్రమ మట్టి తరలిస్తున్న 4 టిప్పర్‌లు స్వాధీనం

KMM: కారేపల్లి మండలం గుట్టకిందగుంపు శివారులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న 4 టిప్పర్లను జిల్లా మైనింగ్ ఏడీ సాయినాథ్ స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల ఫిర్యాదుతో అడవిగుట్ట ప్రాంతంలో దాడులు నిర్వహించి, జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్న వాహనాలను పట్టుకుని కారేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

March 18, 2026 / 05:29 PM IST

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

ADB: నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బుధవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. యువత డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.

March 18, 2026 / 05:29 PM IST

“వినియోగదారులు హక్కుల పై అవగాహన కలిగి ఉండాలి”

BHPL: జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా “సురక్షితమైన ఉత్పత్తులు – నమ్మకమైన వినియోగదారులు” నినాదంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. వినియోగదారులు తమ హక్కులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అధికారులు ఉన్నారు.

March 18, 2026 / 05:28 PM IST

దివ్యాంగ శక్తి.. 12.76 లక్షల మందికి లబ్ధి: మంత్రి

AP: మన్యం జిల్లా సాలూరులోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు పథకాన్ని మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉంటే పథకం వర్తిస్తుందని తెలిపారు. పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 12.76 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే దివ్యాంగ శక్తి లక్ష్యమన్నారు.

March 18, 2026 / 05:28 PM IST

ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ కూలి మృతి

NLG: చిట్యాల మండలం వెలిమినేడులో భవన నిర్మాణ ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీ నారాయణ చంద్ర రాయ్(43) మృతి చెందాడు. ఒక కంపెనీలో గోడ పని చేస్తూ 12 అడుగుల ఎత్తు నుంచి కింద పడటంతో తలకు ఇనుప రాడ్ గుచ్చుకుంది. నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడని ఎస్సై రవికుమార్ తెలిపారు. మృతుడి తండ్రి బిమల్ చంద్ర ఇవాళ ఫిర్యాదు చేశారు.

March 18, 2026 / 05:25 PM IST

‘సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి’

JN: ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అన్నారు. కొడకండ్ల మండలంలోని రంగాపురం, లక్ష్మక్కపల్లి గ్రామాల ముఖ్య నేతలతో ఝాన్సీరెడ్డి సమావేశమయ్యారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు.

March 18, 2026 / 05:24 PM IST

పుట్టపర్తిలో రైతులకు ఆర్థిక సాయం అందజేత

సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీ గోకులం వీధిలో అగ్నిప్రమాదం సంభవించి కేశప్ప, లక్ష్మప్ప, సావిత్రమ్మ అనే రైతులకు చెందిన గడ్డి వాములు కాలి బూడిదయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి తక్షణమే స్పందించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఓదార్చి, వారికి వ్యక్తిగతంగా రూ. 15 వేల ఆర్థిక సాయం అందజేశారు.

March 18, 2026 / 05:24 PM IST