• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘పరిహారం ఇవ్వకుండా శంకుస్థాపన చేయడం తగదు’

AKP: నక్కపల్లి మండలంలో నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన తగ్గదని సీపీఎం జిల్లా కమిటీ తీర్మానించింది. బుధవారం అనకాపల్లి సీపీఎం కార్యాలయంలో పార్టీ సమావేశం జరిగింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కోసం సేకరించిన భూములకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలన్నారు.

March 18, 2026 / 05:11 PM IST

మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారి నియామకం

అన్నమయ్య: మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగియడంతో జేసీ మధుసూదన్ రావును మదనపల్లి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా నియమించారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించి, మౌలిక సేవలు అంతరాయం లేకుండా కొనసాగిస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

March 18, 2026 / 05:09 PM IST

కాలువలోకి దూసుకెళ్లిన కారు

WNP: అదుపుతప్పి కారు కాలువలోకి దూసుకెళ్లిన ఘటన పెబ్బేరు మండలం 44 జాతీయ రహదారిపై ఇవాళ చోటుచేసుకుంది. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న SI యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రమాదంలో డ్రైవర్ కారు అద్దాలు పగలగొట్టి క్షేమంగా బయటకు వచ్చాడన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

March 18, 2026 / 05:07 PM IST

బైక్ ప్రమాదం.. ఒకరికి గాయాలు

KDP: పులివెందుల నుంచి ముద్దనూరు వెళ్లే రహదారిపై మడూరు సమీపంలో బుధవారం బైక్ ప్రమాదం జరిగింది. ముద్దనూరు నుంచి వస్తున్న ఆటో,పులివెందుల నుంచి గ్రామానికి వెళ్తున్న బైకు ఢీ కొట్టింది. గంగాదేవిపల్లి గ్రామానికి చెందిన గుజ్జుల రామచంద్రుడు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని 108లో ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

March 18, 2026 / 05:07 PM IST

ఆదోనిలో దివ్యాంగులకు ఉచిత బస్సు పథకం

KRNL: ఆదోని పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో దివ్యాంగుల ఉచిత బస్సు పథకాన్ని టీడీపీ యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు ప్రారంభించారు. బస్టాండ్ నుంచి ఏరియా హాస్పిటల్ వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. ఈ పథకం ద్వారా 11.16 లక్షల మందికి ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా 12.76 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. సహాయకులకు 50% టికెట్ రాయితీని ప్రభుత్వం ఇవ్వనుంది.

March 18, 2026 / 05:07 PM IST

పేద ముస్లింలకు తోఫా పంపిణీ

NDL: రంజాన్ సందర్భంగా డోన్ ఐద్వా ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు షేమిమ్ బేగం మాట్లాడుతూ రంజాన్ పండుగ సేవాభావానికి ప్రతీక అని, పేదలతో ఈ ఆనందం పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. సమాజంలో ఐక్యత పెంపొందించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు కీలకమని పేర్కొన్నారు. 

March 18, 2026 / 05:05 PM IST

పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: సీపీ

కరీంనగర్‌లోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా ‘స్టాటిక్ ఫోర్స్’తో భద్రత కల్పించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల నిఘాను పరిశీలించిన ఆయన, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని ఆదేశించారు.

March 18, 2026 / 05:03 PM IST

‘రైతు భరోసాను వెంటనే జమ చేయాలి’

SRPT: రైతు భరోసా నిధులను ఏకకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, ఏవో సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. పంటల బీమా అమలు చేయాలని, యూరియా యాప్‌ ఇబ్బందులను తొలగించాలని నేతలు కోరారు. మొంథా తుఫాన్ బాధితులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు.

March 18, 2026 / 05:03 PM IST

పరీక్షకు మొత్తం 11 మంది గైర్హాజరు

సిరిసిల్ల జిల్లాలో బుధవారం జరిగిన పదవ పరీక్షకు మొత్తం 11 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మొత్తం 34 పరీక్ష కేంద్రాల్లో 7308 మందికి గాను 7297 మంది హాజరయ్యారన్నారు. మొత్తం జిల్లాలో హాజరు 99.85 శాతంగా నమోదు అయిందన్నారు.

March 18, 2026 / 05:03 PM IST

‘మోత్కూర్‌లో ఉగాది పండుగకి సర్వం సిద్ధం’

BHNG: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అమ్మవారి దేవాలయాల్లో ఉగాది ఏర్పాట్లను మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం స్వప్న, కమిషనర్ సతీష్ దగ్గరుండి పర్యవేక్షించారు. పట్టణంలో ఉగాది అతిపెద్ద పండుగ అని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగ జరుపుకోవాలని కోరారు.

March 18, 2026 / 05:02 PM IST

మరకత శ్రీలక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు

MDCL: అల్వాల్ సర్కిల్ పరిధి కనజిగూడలోని మరకత శ్రీలక్ష్మీ గణపతి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 5 నుంచి 7 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోమాల్లో పాల్గొనదలచిన భక్తులు గోత్రనామాలతో ఆలయ కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు.

March 18, 2026 / 05:02 PM IST

‘బాసర IIIT వీడియో ఫేక్’

NRML: బాసర IIITలో విద్యార్థులను పోలీసులు దూషించారనే వార్తలను జిల్లా పోలీసులు ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వాయిస్ మార్ఫింగ్ చేశారని, అది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రజలు, విద్యార్థులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వీడియోలు సృష్టించారని పోలీస్ శాఖ క్లారిటీ ఇచ్చింది.

March 18, 2026 / 05:02 PM IST

‘SIR ప్రక్రియ వేగవంతం చేయాలి’

MDK: జిల్లా ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించాలన్నారు.

March 18, 2026 / 05:01 PM IST

‘బ్యాంకర్లు లక్ష్యాలను సాధించాలి’

WNP: ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన రుణ ప్రణాళికలో భాగంగా మార్చి 31లోపు 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం వనపర్తి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బీమా చేయించే బాధ్యతను బ్యాంకర్లు తీసుకోవాలని ఆదేశించారు.

March 18, 2026 / 05:00 PM IST

‘వైసీపీని మరింత బలోపేతం చేయాలి’

E.G: గోపాలపురం వైసీపీ కార్యాలయం వద్ద మాజీ హోం మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో డివిజన్ ఇంఛార్జ్, మండల అధ్యక్షులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, వైసీపీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

March 18, 2026 / 05:00 PM IST