• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మురికి కాలువలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

NZB: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ఉన్న మురికి కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వన్ టౌన్ SHO రఘుపతి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 45 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయాడు. మృతుడి జేబులో రూ.4000 నగదు లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.

March 18, 2026 / 01:32 PM IST

‘పారాది వంతెన నిర్మాణం వేగవంతం చేయాలి’

VZM: బొబ్బిలిలో పారాది వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే బేబినాయన, ఆర్అండ్ బి అధికారులకు ఆదేశించారు. ఇవాళ బొబ్బిలి కోటలో నిర్వహించిన సమీక్షలో అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వేగవతి వంతెన పనులపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

March 18, 2026 / 01:32 PM IST

ఈ నెల 27న కాణిపాకంలో శ్రీ సీతారాముల కళ్యాణం

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11.57 నుంచి 12.46 వరకు అభిజిత్ లగ్నంలో కార్యక్రమం జరుగుతుందన్నారు. భక్తులు ముందుగా పేర్లను నమోదు చేసుకుని రూ.300 టికెట్ తీసుకోవాలని ఈవో పెంచల కిశోర్ సూచించారు.

March 18, 2026 / 01:32 PM IST

సీనియార్టీ ప్రాతిపదికన విధులు

JGL: సీనియారిటీ ప్రాతిపదికన ఉపాధ్యాయులకు విధులు కేటాయించాలని టీఆర్టీఎఫ్ నాయకులు రాయికల్ తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఇంతకు పూర్వం జరిగిన ఎన్నికల విధుల్లో కొంతమంది ఉపాధ్యాయులకు మూడు దశల్లో డ్యూటీలు పడగా, కొందరికి అసలే పడలేదని పేర్కొన్నారు. జనగణన విధులు ఇలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

March 18, 2026 / 01:30 PM IST

రైతుబంధు డబ్బులు చెల్లించాలని పోస్ట్ కార్డు ఉద్యమం

MNCL: రైతులకు ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హెచ్చరించారు. రైతుబంధును చెల్లించాలని కోరుతూ.. బుధవారం లక్షెట్టిపేట పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ నాయకులు పోస్ట్ కార్డులలో రాసి ప్రభుత్వానికి పంపారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు పెట్టుబడి సహాయంగా అమలు చేసిన రైతుబంధు డబ్బులు చెల్లించాలన్నారు.

March 18, 2026 / 01:30 PM IST

ప్రాథమిక పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుకలు

SRCL: తంగళ్ళపల్లి మండలం నేరెళ్లలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం ముందస్తు ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నేరెళ్ల సర్పంచ్ పొన్నం లక్ష్మణ్ ఉగాది పండుగ విశిష్టత, షడ్రుచుల లాభాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం సర్పంచ్, అధ్యాపకులు, విద్యార్థులతో ఉగాది పచ్చడి సేవించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దుబ్బాక ప్రభాకర్, గ్రామ కార్యదర్శి సతీష్ పాల్గొన్నారు.

March 18, 2026 / 01:30 PM IST

హోటల్స్ క్లోజ్.. అన్న క్యాంటిన్లకు జనం

AP: వాణిజ్య LPG కొరతతో రాష్ట్రంలో పలు హోటళ్లు మూతపడుతుండటంతో అన్న క్యాంటీన్లపై ఒత్తిడి పెరుగుతోంది. గతంలో ఒక్కో కేంద్రంలో 500 మందికి భోజనం అందించగా, ప్రస్తుతం అదనంగా 150 మీల్స్ సరఫరా చేస్తున్నారు. సాధారణంగా మధ్యాహ్నం 3 గంటల వరకు అందే భోజనం.. రద్దీ వల్ల 2 గంటలకే అయిపోతోందని నిర్వాహకులు తెలిపారు. హోటళ్లు మూతపడటంతో సామాన్యులు, విద్యార్థులు అన్న క్యాంటీన్లనే ఆశ్రయిస్తున్నారు.

March 18, 2026 / 01:30 PM IST

వృధాగా.. నీటి తొట్లు

NLG: పశువుల దాహార్తి తీర్చేందుకు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా నీటి తొట్లు ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ లేక అవి నిరుపయోగంగా మారాయని జిల్లాలోని ఆయా గ్రామాల పశుపోషకులు తెలిపారు. కొన్నిచోట్ల పాక్షికంగా ధ్వంసం కాగా మరికొన్ని గ్రామాల్లో వ్యర్థాలతో నిండుతున్నాయన్నారు. వేసవి దృష్ట్యా అధికారులు వినియోగంలోకి తీసుకురావాలని పశుపోషకులు కోరుతున్నారు.

March 18, 2026 / 01:30 PM IST

మాజీ మంత్రిపై స్పందించిన శ్రీధర్ బాబు

KNR: మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంశంపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు. ఆయన సీనియర్ నాయకుడని, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ప్రాధాన్యం కోరలేదని తెలిపారు. స్థానిక సమస్యల కారణంగానే అసంతృప్తి నెలకొన్నట్టు పేర్కొన్నారు. ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మాట్లాడి పరిష్కారం చూపాలని అభిప్రాయపడ్డారు. అవసరమైతే తాను కూడా చర్చిస్తానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

March 18, 2026 / 01:30 PM IST

బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

JN: పాలకుర్తి మండల వల్మిడి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం సమీక్షించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్, తాగునీరు, వైద్యం, విద్యుత్ తదితర ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

March 18, 2026 / 01:30 PM IST

PSL: ఆస్ట్రేలియా క్రికెటర్లకు హెచ్చరిక

PSLలో ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, లబుషేన్, మాక్స్‌వెల్ భాగం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ క్రికెటర్లు పాక్‌కు వెళ్లొచ్చు కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ పెషావర్‌లో మాత్రం అడుగుపెట్టొద్దంటూ హెచ్చరించింది. షెపావర్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం నో ట్రావెల్ జోన్‌లోకి చేర్చడమే దీనికి కారణం.

March 18, 2026 / 01:28 PM IST

దివ్యాంగులకు గుడ్ న్యూస్..!

KRNL: జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 2025- 26 సంవత్సరానికి గాను 9 దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులకు ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 31, 2026 సాయంత్రం 5 గంటల లోపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలని అధికారులు తెలిపారు.

March 18, 2026 / 01:26 PM IST

అసెంబ్లీలో ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఫైర్

TG: అసెంబ్లీ జీరో అవర్‌లో ఆర్మూర్ MLA రాకేశ్‌రెడ్డి నిజామాబాద్(D)లో రోడ్ల దుస్థితిపై మండిపడ్డారు. రోడ్లపై మీటరు లోతు గుంతలు ఉండటంతో ప్రజలు నడవలేని స్థితిలో ఉన్నారని ఫైర్ అయ్యారు. ఆర్మూరులో SC, ST, BC, మైనార్టీ, మహిళా హాస్టల్స్‌ను మంజూరు చేయాలని కోరారు. అలాగే, ఎర్రజొన్నలకు రూ.500 బోనస్ ఇవ్వాలని, అవసరమైతే ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

March 18, 2026 / 01:26 PM IST

RTC బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం..!

W.G: ఉండి బస్సు స్టాండ్‌లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు బుధవారం దివ్యాంగశక్తి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అమల్లో ఉన్న మహిళలకు స్త్రీశక్తి పధకం క్రింద ఉచిత బస్సు ప్రయాణ పథకం ఉన్నట్లే.. అలాగే దివ్యాంగులకు కూడా వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

March 18, 2026 / 01:25 PM IST

గ్రావెల్ రవాణాతో ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు..!

NDL: సిరివెళ్ల మండల వజ్రాల ఎర్ర వంక వాగు నుంచి గ్రావెల్ మట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం గాజుల పల్లె పరిధిలో నంద్యాల-గిద్దలూరు రహదారిపై ఈ టిప్పర్ల రాకపోకల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందని స్థానికులు తెలిపారు.ఈ పరిస్థితిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

March 18, 2026 / 01:24 PM IST