• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆటోలో వ్యక్తి డెడ్ బాడీ లభ్యం

చిత్తూరు: గంగవరం మండలం ఎర్రమనగుంట చెరువు వద్ద ఆటోలో సోమవారం ఓ వ్యక్తి డెడ్ బాడీ లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా మరెవరైనా హత్య చేసి శవాన్ని అక్కడే వదిలి వెళ్లారా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 10, 2025 / 04:25 PM IST

అంగన్వాడి పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

CTR: పుంగనూరు ICDS ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న రెండు అంగన్వాడి సహాయకురాలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు CDPO రాజేశ్వరి సోమవారం తెలిపారు. పుంగనూరు అర్బన్ రాంనగర్ అంగన్వాడి సహాయకురాలు (OC) కేటగిరీ, సోమల మండలం ముండ్రివారిపల్లె సహాయకురాలు (BC-D) కేటగిరీలో అవకాశం ఉన్నట్లు తెలిపారు. అర్హులు ఈ నెల 22తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 10, 2025 / 04:24 PM IST

ఇందిరాపార్కు వద్ద గ్రామీణ వైద్యుల ధర్నా

TG: హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద గ్రామీణ వైద్యులు ధర్నా చేపట్టారు. తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. RMP, PMPలపై మెడికల్ కౌన్సిల్ దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. తమకు శిక్షణ తరగతులు నిర్వహించాలని, హెల్త్ గైడ్‌లుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. 

February 10, 2025 / 02:28 PM IST

శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం

VZM: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం శ్రీ రామనారాయణంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారాముల వారికి శాంతి కళ్యాణం జరిపారు. ఆలయ అర్చకులు చాణక్య, హర్ష, కృష్ణ తేజ ఆధ్వర్యంలో జరిపిన ఈ కళ్యాణంలో ట్రస్ట్ సభ్యులు శ్రీ నారాయణం సీతారామయ్య, పద్మశ్రీ,నారాయణం శ్రీనివాస్, రామారావు పట్నాయక్ మాస్టర్, భక్తులు పాల్గోన్నారు.

February 10, 2025 / 02:18 PM IST

శీష్ మహాల్‌కు దూరంగా బీజేపీ సీఎం!

ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ CMగా పనిచేసిన టైంలో సివిల్ లైన్స్‌లో ఆయన అధికారిక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదొక శీష్ మహల్ అంటూ ఎన్నికల ప్రచారంలో BJP జోరుగా విమర్శలు చేసింది. తాజా ఎన్నికల్లో BJP విజయం సాధించిన తరుణంలో ఆ పార్టీ MLAల్లో ఎవరు CM అయినా.. వారు శీష్ మహాల్‌లో నివాసం ఉండకపోవచ్చని సమాచారం. అయితే ఈ మహల్‌ను మ్యూజియంగా మారుస్తారని తెలుస్తోంది.

February 10, 2025 / 02:17 PM IST

ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

VZM: తెర్లాం మండలం కొరాటం గ్రామంలో ఎంపీపీ పాఠశాలను సోమవారం మండల విద్యాధికారి త్రినాధరావు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పాఠశాలలో జరుగు అసెంబ్లీ తీరును, విద్యార్థుల యొక్క హాజరు పట్టికను, విద్యా స్థాయిని తనిఖీ చేశారు. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమల తీరును, మరుగుదొడ్లు శుభ్రతను తదితర వాటిని పరిశీలించారు.

February 10, 2025 / 01:55 PM IST

వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

అనంతపురం: తాడిపత్రి మండలంలో ఎమ్మేల్యే జేసీ అస్మిత్ రెడ్డి సోమవారం పర్యటించారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, వెంకటంపల్లి గ్రామాలలో అధికారులతో కలిసి గ్రామ సభ నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుంటూ వాటికి వెంటనే పరిష్కార మార్గం చూపాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మండల అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

February 10, 2025 / 01:55 PM IST

“రైతుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం’

అనంతపురం: గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. మండల తహశీల్దార్ ఓబులేసుకు భూ సమస్యలపై రైతులు అర్జీలను సమర్పించారు. తహశీల్దార్ మాట్లాడుతూ.. మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు భూ సమస్యలపై అలాగే పట్టణంలోని నిరుపేదలు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని అర్జీలను ఇచ్చారన్నారు. వాటికి త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు.

February 10, 2025 / 01:53 PM IST

‘ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుంది’

NGKL: ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లి గ్రామంలో ఇవాళ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అతిథిగా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ మల్లేష్, లక్ష్మి నరసింహ టెంపుల్ ఛైర్మన్ నరసింహ రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

February 10, 2025 / 01:33 PM IST

‘వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించండి’

NLR: రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ సోమవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనంతసాగరం మండల కమిటి ఆధ్వర్యంలో అనంతసాగరం డిప్యూటీ తహసీల్దార్ జ్యోతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జిల్లాలో వరి కోతలు మార్చి నుంచి ముమ్మరంగా కొనసాగుతాయని, వెంటనే వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని కోరారు.

February 10, 2025 / 01:32 PM IST

‘జన్నారంలో 44,260 మంది ఓటర్లు’

MNCL: జన్నారం మండలంలో మొత్తం 44,260 మంది ఓటర్లు ఉన్నారని ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం మండల ఓటర్ల జాబితాను విడుదల చేశారు. మండలంలో ఒక జడ్పీటీసీ, 15 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మండలంలో మొత్తం 44,260 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 21,620 పురుషులు, 22,638 మహిళలు, ఇద్దరు ఇతర ఓటర్లు ఉన్నారన్నారు.

February 10, 2025 / 01:24 PM IST

‘సమస్యల పరిష్కారం కొరకే ప్రజా ఫిర్యాదుల విభాగం’

NRML: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఫిర్యాదుల విభాగంలో ఆమె పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించేలా కృషి చేయాలన్నారు.

February 10, 2025 / 01:22 PM IST

‘జలజీవన్ మిషన్ అమలులో కూటమి ప్రభుత్వం విఫలం’

SKLM: రాష్ట్రంలో ప్రజలకు స్వచ్ఛమైన సురక్షిత త్రాగునీరు అందించేందుకు అప్పటి సీఎం జగనన్న జలజీవన్ మిషన్‌కు నిధులు కేటాయించి పనులు ప్రారంభించారని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక వారి ఆ సమర్థతను జగన్ మీదకు నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

February 10, 2025 / 01:15 PM IST

ఖానాపూర్‌లో పర్యటించిన జిల్లా కలెక్టర్

NRML: ఖానాపూర్ నియోజకవర్గంలో సోమవారం అభిలాష అభినవ్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు వార్డులను తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను త్వరలోనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. వీరి వెంట స్థానిక అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

February 10, 2025 / 12:44 PM IST

పరీక్షా పే చర్చ  వీక్షించిన విద్యార్థులు

NLR: అనంతసాగరం మండలం చిలకలమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రధాని మోదీ చేపట్టిన పరీక్షా పే చర్చ  కార్యక్రమాన్ని విద్యార్థులు వీక్షించారు. హెచ్ఎం సురేశ్ మాట్లాడుతూ.. విద్యార్థులలో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని మోదీ ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

February 10, 2025 / 12:41 PM IST