KMR: మమ్మద్ నగర్ మండలం తెల్గాపూర్ శివారులో ఎలుగుబంటి మంగళవారం కనిపించడంతో గ్రామాల్లో భయం నెలకొంది. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి బుధవారం ఎలుగుబంటి కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు. అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.