NLG: నార్కట్పల్లి మండల పరిధిలోని చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం సందర్భంగా శివలింగానికి అభిషేకం చేసి, స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భూపాల్ రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
MNCL: నిరుద్యోగులకు మేలు చేయడానికే అప్రెంటిషిప్ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని జన్నారం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ బీ.రాములు అన్నారు. సోమవారం మధ్యాహ్నం జన్నారం పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు న్నారు.
NLR: సోమశిల గ్రామంలోని బస్టాండ్ వద్ద ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ ప్రాంతంలో 30ఏళ్లకు పైగా ఉన్న ప్రాథమిక పాఠశాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ పాఠశాలను ఇక్కడి నుంచి తొలగించవద్దని నిరసన తెలియపరిచారు.
TG: చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడిని కేంద్రమంత్రి బండి సంజయ్ ఖండించారు. ‘నిన్న రంగరాజన్కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. ఆయనకు కావాల్సిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చాను. రంగరాజన్ త్వరగా కోలుకోవాలి’ అని కేంద్రమంత్రి ఆకాంక్షించారు. కాగా.. ఈ ఘటనలో మొత్తం 22 మందిపై కేసు నమోదవగా 17 మంది నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
AP: కష్టమైనా అభివృద్ధి, సంక్షేమం దిశగా సీఎం చంద్రబాబు పాలన అందిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గుండె జబ్బు వస్తే రూ.60 వేలు విలువైన ఇంజక్షన్ ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లో ఇంజక్షన్లను అందుబాటులో ఉన్నాయన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఆర్థిక అరాచకం సృష్టించి, అప్పులు చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని విమర్శించారు.
NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శ్రీశైలం బయలుదేరారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన మరి కాసేపట్లో శ్రీశైలం చేరుకోనున్నారు. శ్రీశైలం వెళ్తూ మార్గ మధ్యలో బనగానపల్లె (మం) కైప గ్రామంలో రూ. 2 కోట్ల నిధులతో చేపడుతున్న సీసీరోడ్ల నిర్మాణాన్ని మంత్రి బీసీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడకుండా నిర్మించాలని ఆదేశించారు.
NLR: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని ఏఎన్ఎం నూర్జహాన్ తెలిపారు. సోమవారం ఉదయగిరి బీసీ కాలనీలోని తెలుగు ఉర్దూ పాఠశాలలో విద్యార్థులు అసెంబ్లీ జరిగే సమయంలో ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ.. జాతీయ నులిపురుగుల దినోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరు మధ్యాహ్నం భోజనం తర్వాత ఆల్బెండజోల్ టాబ్లెట్స్ తీసుకోవాలని సూచించారు.
KMM: తల్లాడ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన గొల్లమందల రవికి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ డాక్టరేట్ బహుమతి అందించింది. రవి వృక్ష సంపద, వాటి పరిరక్షణ, అవసరాలపై పరిశోధన చేశారు. సర్పంచుల సంఘం మాజీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు నారపోగు వెంకట్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
WNP: బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఓ ఫొటోగ్రాఫర్ మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. చందాపూర్కి చెందిన అనిల్ కుమార్ ఫొటోగ్రాఫర్గా పనిచేస్తూ జీవిస్తున్నారు. నిన్న రాత్రి వనపర్తి నుంచి చందాపూర్ వస్తుండగా మార్గమధ్యలో బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు.
అనకాపల్లి: బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలోని ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థిని పట్ల అసంభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ గంగా ప్రసాద్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఏ. శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. చోడవరం కోర్టులో ముద్దాయిని హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. అనంతరం నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
KRNL: కౌతాళం మండలంలో గత రెండు సంవత్సరాలు నుంచి మిరప పంటకు సరైన ధర లేక రైతులు దివాలా తీస్తున్నారని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లయ్య అన్నారు. మిరప పంటకు క్వింటాలకు రూ. 50 వేల ధర ఇవ్వాలని మల్లయ్య, మండల కార్యదర్శి ఈరన్న డిమాండ్ చేశారు.
కృష్ణా: గన్నవరం మండలంలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. వీరపనేనిగూడానికి చెందిన రానిమేకల వీరబాబు(44) మద్యానికి బానిసై, భార్య డబ్బులివ్వలేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
VZM: మూడు రోజుల నుండి నాణ్యమైన భోజనం పంపిణీ చేయకపోవడంతో సాలూరు బిసి బాలుర కళాశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. జావ లాంటి అన్నం పెడుతుండడంతో విద్యార్థులు రోడ్డెక్కారు. ఆదివారం సాయంత్రం ఎస్ఎఫ్ఎస్ఐ ఆధ్వర్యాన విద్యార్ధులు నాణ్యమైన భోజనం పెట్టాలని ధర్నా చేశారు. భోజనం అందించకపోవడం దారుణమని, వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలి అని ఎస్ఎఫ్ఎస్ఐ నాయకులు రాజు అన్నారు.
వికారాబాద్: ఇష్టమైన రంగాల్లో రాణించాలనుకునే మహిళలకు జాతీయక్రీడాకారిణి నవనీత స్ఫూర్తిగా నిలవడం అభిందనీయమని తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. ఇందిరానగర్ 5వ వార్డుకు చెందిన నవనీత మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ జాతీయస్థాయి మహిళల విభాగంలో హైజంప్లో మొదటిస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది.
HYD: నాంపల్లిలో జనవరి 3న 84వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల(నుమాయిష్) కొనసాగుతుంది. ఫిబ్రవరి 15తో ఈ ప్రదర్శనకు తెరపడనుందని నిర్వహకులు తెలిపారు. మరో 2 రోజుల పాటు ప్రదర్శనను కొనసాగించేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఎగ్జిబిషన్ సొసైటీ కోరింది. కానీ HYD సీపీ సీవీ ఆనంద్ ఇందుకు నిరాకరించారు.