WNP: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి, నీటి పన్ను బకాయిల వసూలులో వేగం పెంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన ఛాంబర్లో ఐదు మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పెండింగ్లో ఉన్న బకాయిదారుల జాబితాను సిద్ధం చేసి వారికి నోటీసులు పంపించాలన్నారు.