GNTR: కాకుమాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలను తహసీల్దార్ బి. వేంకటస్వామి బుధవారం పరిశీలించారు. విద్యార్దులకు ఏర్పాటు చేసిన సదుపాయాలపై చీఫ్ సూపరింటెండెంట్తో మాట్లాడి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రంలో తాగునీరు,హెల్త్ క్యాంపు ఏర్పాట్లను సందర్శించారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.