అన్నమయ్య: జిల్లా మదనపల్లిలో నూతన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా, డీఐజీ కోయ ప్రవీణ్, కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రారంభించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావడానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని తెలిపారు. ఇకపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక కూడా ఇక్కడే జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.