PLD: గుండ్లపాడు జంట హత్య కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బుధవారం బెయిల్ మంజూరైంది. జంట హత్య కేసులో ఆయన 6వ నిందితుడుగా ఉన్నాడు. 98 రోజులుగా నెల్లూరు జిల్లా జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి గుంటూరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.