అన్నమయ్య: జిల్లా మదనపల్లిలో నూతన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా, డీఐజీ కోయ ప్రవీణ్, కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రారంభించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావడానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని తెలిపారు. ఇకపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక కూడా ఇక్కడే జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
PLD: గుండ్లపాడు జంట హత్య కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బుధవారం బెయిల్ మంజూరైంది. జంట హత్య కేసులో ఆయన 6వ నిందితుడుగా ఉన్నాడు. 98 రోజులుగా నెల్లూరు జిల్లా జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి గుంటూరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
VZM: రోడ్డు ప్రమాదంలో మరణించిన గజపతినగరం కానిస్టేబుల్ టి. తిరుపతిరావు కుటుంబానికి తోటి సిబ్బంది కలిసి రూ.4.30 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ మొత్తాన్ని ఎస్పీ దామోదర్ చేతుల మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. సహోద్యోగి కుటుంబానికి అండగా నిలవడం ఐక్యతకు నిదర్శనమన్నారు.
VSP: అర్హులైన పేదలకు అర్బన్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు మురుపల్లి పైడిరాజు అన్నారు. బుధవారం మధురవాడలో ఆయన మాట్లాడారు. ఈనెల 24 నుంచి సచివాలయాల వద్ద ధర్నాలు చేపడతామని తెలిపారు. ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెన్షన్ల కోతలు ఆపాలని కోరారు.
GNTR: కాకుమాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలను తహసీల్దార్ బి. వేంకటస్వామి బుధవారం పరిశీలించారు. విద్యార్దులకు ఏర్పాటు చేసిన సదుపాయాలపై చీఫ్ సూపరింటెండెంట్తో మాట్లాడి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రంలో తాగునీరు,హెల్త్ క్యాంపు ఏర్పాట్లను సందర్శించారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.
AP: విజయవాడ SS కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఆధినేత వైఎస్ జగన్ పాల్గొన్నారు. ముస్లింలందరూ జగన్ వెంటే ఉన్నారని.. 2029లో జగన్ను సీఎం చేస్తామని మాజీ మంత్రి అంజద్ భాషా అన్నారు. కాగా, ఇందులో ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు.
TG: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూములపై తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో విధించింది. భూదాన్ భూములపై యథాస్థితి కొనసాగించాలని ఆదేశించింది. నష్టపోయిన బాధితులందరికీ ఇళ్లు మంజూరు చేయాలని భూదాన్ భూముల బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. కేవలం 311 మంది మాత్రమే కాదు, అక్కడ ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని ఆదేశించింది.
కేడీ: ది డెవిల్ మూవీలోని ‘సర్కే చునార్ తేరి సర్కే’ పాట వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై సింగర్ మంగ్లీ స్పందించారు. ‘అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. జరిగిన దానికి చింతిస్తున్నాం. ఇలా మరోసారి జరగదు’ అని ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టారు.
PPM: ప్రజల భాగస్వామ్యం, స్థానిక సహకారంతో పీహెచ్సీలను అభివృద్ధి చేయడమే “ముస్తాబు” లక్ష్యమని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి బుధవారం తెలిపారు. జీయ్యమ్మవలస మండలం ఆర్.ఆర్.బ పురం పీహెచ్సీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రులు దేవాలయాల్లాంటివని పేర్కొంటూ, పరిశుభ్రత, మెరుగైన సేవలు ఉండాలని సూచించారు.
ATP: గుంతకల్లు సీపీఐ నాయకులు ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కీర్తి కిరణ్ రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. సీపీఐ నాయకులు వీరభద్ర స్వామి మాట్లాడుతూ.. పట్టణంలోని నర్సింగ్ హోమ్లో 24×7 ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు రోగులను అడ్మిట్ చేసుకోవడం లేదని ఆయన తెలిపారు.
KMR: జిల్లాలోని 9 మండలాల్లో 12 శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మార్క్ఫెడ్ జిల్లా అధికారి చందు తెలిపారు. జిల్లాలోని బిచ్కుంద, సదాశివ్ నగర్, తాడ్వాయి మండలాల్లో రెండు కేంద్రాల చొప్పున, మద్నూర్, డోంగ్లి, జుక్కల్, రాజంపేట, గాంధారి, పెద్ద కొడపగల్ మండలాల్లో ఒక్కటి చొప్పున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం వెల్లడించారు.
TPT: నారావారిపల్లెలో కీర్తి శేషు నారా రామ్మూర్తి నాయుడు 74వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి NRN ఘాట్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని, వారి కుమారులు నాయకులతో కలసి ఆయనకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో నారా రోహిత్, నారా గిరీష్, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
E.G: నిడదవోలు మండలం సెట్టిపేట గ్రామంలో లేస్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ నిర్వహిస్తున్న యూనిట్ను కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ చేతి అల్లికలతో అందంగా తీర్చిదిద్దిన వివిధ రకాల దుస్తులను పరిశీలించారు. ఈ మేరకు లేస్ వర్క్ & ఎంబ్రాయిడరీ రంగాల్లో మహిళలు చూపిస్తున్న ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు.
BHNG: జానకిపురం గ్రామంలో ఇవాళ పశువులకు ఉచిత గాలి కుంటు నివారణ టీకాలు Dr. అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అనిత – సమ్మయ్య యాదవ్ హాజరై మాట్లాడుతూ.. ఇది పశువుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అందిస్తున్న గొప్ప అవకాశం అన్నారు. పశు వైద్య సిబ్బంది VA ఈశ్వరయ్య, గోపాలమిత్రలు శ్రీనివాసులు, మల్లేష్ గ్రామ రైతులు పాల్గొన్నారు.
BPT:చీరాల మండలం ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కలవారిపాలెం ప్రాంతంలో బుధవారం పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారంతో ఎస్సై చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 11,200 రూపాయలు నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, ఆరు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు ఎస్సై చెప్పారు.