సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ముగియడంతో ప్రత్యేక అధికారిగా ఆర్డీవో సువర్ణ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, స్థానిక నాయకులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుట్టపర్తి అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని పేర్కొన్నారు.