ASF: పాఠశాల విద్యార్థులకు ఒంటిపూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలు ఈతకు వెళ్లే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ బుధవారం సూచించారు. పిల్లలకు ఈత నేర్పించాలనుకుంటే తల్లిదండ్రులు లేదా పెద్దల పర్యవేక్షణలోనే నేర్పించాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు.