VZM: రోడ్డు ప్రమాదంలో మరణించిన గజపతినగరం కానిస్టేబుల్ టి. తిరుపతిరావు కుటుంబానికి తోటి సిబ్బంది కలిసి రూ.4.30 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ మొత్తాన్ని ఎస్పీ దామోదర్ చేతుల మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. సహోద్యోగి కుటుంబానికి అండగా నిలవడం ఐక్యతకు నిదర్శనమన్నారు.