• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బార్లీతో ఆరోగ్య ప్రయోజనాలు

శరీరంలోని అధిక వేడిని తగ్గించడానికి బార్లీ ఒక అద్భుతమైన సహజ పానీయం. ఇది శరీరాన్ని చల్లబరిచి, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. డీహైడ్రేషన్, అజీర్తి, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్ర సంబంధిత సమస్యలను నివారిస్తుంది. బార్లీ నీరు కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించడమే కాకుండా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. విటమిన్లు, ఖనిజాలతో నిండిన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

March 18, 2026 / 10:07 AM IST

రైల్వే ట్రాక్‌పై మృతదేహం లభ్యం

WGL: నెక్కొండ మండలం మడిపల్లి గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఇవాళ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు రైలు కింద పడి జరిగిన మరణమా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 18, 2026 / 10:07 AM IST

తీవ్ర విషాదం.. పాముకాటుతో చిన్నారి మృతి

WGL: నెక్కొండ మండలం భూక్య తండాలో తీవ్ర విషాదం నెలకొంది. ఆడుకుంటున్న చిన్నారిని పాము కాటు వేయడంతో మృతిచెందగా విషాద ఛాయలు అమలుకున్నాయి. లావుడ్యా తిరుపతి-సుజాత దంపతుల కుమార్తె కుట్టి (3) నిన్న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా పాము కాటుకు గురైంది. పాప నోటి నుంచి నురుగు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించింది.

March 18, 2026 / 10:06 AM IST

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

ప్రకాశం: బేస్తవారిపేటలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద బుధవారం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్సై రవీంద్ర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని అలాగే పరీక్ష కేంద్రాల సమీపంలోని నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు స్వచ్ఛందంగా మూసివేసినట్లు తెలిపారు.

March 18, 2026 / 10:05 AM IST

తలమడుగు PHCలో వైద్య పరికరాల ప్రారంభం

ADB: తలమడుగు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో SBI మరియు మిత్ర ఎన్జీఓ సహకారంతో రూ. 2 లక్షల విలువైన నూతన వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారులు, SBI మేనేజర్లు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

March 18, 2026 / 10:04 AM IST

కళ్యాణదుర్గం మండలంలో 19.0 మి.మీ వర్షపాతం నమోదు

ATP: జిల్లాలో గడిచిన 24 గంటల్లో పలు మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా కళ్యాణదుర్గం మండలంలో 19.0 మి.మీ వర్షపాతం నమోదైంది. బెలుగుప్పలో 14.6, డి.హీరేహాల్‌లో 13.4, కూడేరులో 11.2 మి.మీ చొప్పున వర్షం పడింది. జిల్లా సగటు వర్షపాతం 3.3 మి.మీగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా జిల్లాలోని 11 మండలాల్లో వర్షం కురిసింది.

March 18, 2026 / 10:03 AM IST

డ్రగ్స్ మాఫియాతో రోహిత్ రెడ్డి లింకులు?

TG: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్ నుంచి ORR వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అభిషేక్‌పై గతంలోనూ పలు డ్రగ్స్ కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో రోహిత్ రెడ్డికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అభిషేక్ కోసం పోలీసులు ...

March 18, 2026 / 10:02 AM IST

పిన్నాయిపాలెంలో ఉచిత బ్యాంక్ ఖాతాల ప్రారంభం

సూర్యపేట మండలం పిన్నాయిపాలెం గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్ చింత భవాని మధు ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ వారి ఉచిత ఖాతాల ప్రక్రియను ప్రారంభించారు. ​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామస్తులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు, ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా ఖాతాలు తెరిచే సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు.

March 18, 2026 / 10:01 AM IST

నిజాంసాగర్ నుంచి నాలుగో విడత నీటి విడుదల

KMR: పంట సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి బుధవారం నాలుగో విడత నీటిని విడుదల చేశారు. 1,700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.919 టీఎంసీల నీటి నిల్వ ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయా పరిధిలోని రైతులు ఈ నీటిని సద్వినియోగం చేసుకుని పంటలను కాపాడుకోవాలన్నారు.

March 18, 2026 / 10:01 AM IST

‘పట్టణ సౌందర్యాన్ని దెబ్బతీసేలా రోడ్లపై చెత్త వేయకూడదు’

GDWL: వడ్డేపల్లి పట్టణాన్ని రోగాల బారి నుంచి రక్షించాలంటే పరిశుభ్రతే ఏకైక మార్గం అని మున్సిపల్ ఛైర్మన్ మంజుల ధర్మ పేర్కొన్నారు. బుధవారం తెలవరుజమున ప్రధాన రహదారులు, బజార్లలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న పనిని పరిశీలించారు. పట్టణ సౌందర్యాన్ని దెబ్బతీసేలా రోడ్లపై చెత్త వేయకూడదని, ప్రతి ఒక్కరూ మున్సిపల్ వాహనాలకే వ్యర్థాలను అందించాలన్నారు.

March 18, 2026 / 10:01 AM IST

‘ఇంటి పన్నులను 100 శాతం వసూలు చేయాలి’

JGL: ఇంటి పన్నులను 100 శాతం వసూలు చేయాలని, ఇబ్రహీంపట్నం ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. ఇబ్రహీంపట్నం ఎంపీపీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటి పన్నులను 100 శాతం వసూలు చేయాలని, నర్సరీలో మిగిలిన పనులను పూర్తి చేయాలని ఆయన ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు.

March 18, 2026 / 10:01 AM IST

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి

NLG: మాడుగులపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చెరువుపల్లి గ్రామానికి చెందిన పాలువాయి సుమలతతో పాటు మరో ఇద్దరు మహిళలకు తహసీల్దార్ సామల సరోజ పావని చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్, సర్పంచ్ వడ్డె సైదిరెడ్డి పాల్గొన్నారు.

March 18, 2026 / 10:01 AM IST

మున్సిపల్ నల్లాల ద్వారా మురికి నీరు సరఫరా

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ పరిధి సాయి కాలనీ, శ్రీనివాస కాలనీలలో నల్లాల ద్వారా గత నాలుగు రోజులుగా అపరిశుభ్రమైన మంచినీరు సరఫరా అవుతోంది. రోడ్డు విస్తరణలో భాగంగా పాత పైపు లైన్ స్థానంలో ఏర్పాటు చేసిన కొత్త పైపు లైన్‌లో పేరుకుపోయిన మట్టితో కూడిన నీరు నల్లాల ద్వారా వస్తుండడంతో తాగలేని పరిస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు.

March 18, 2026 / 10:01 AM IST

అప్పులభాద తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య

SDPT: దుబ్బాక మండలం రఘోతంపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన చిన్నారెడ్డి మోహన్ రెడ్డి అనే రైతు అప్పుల బాధ తట్టుకోలేక బుధవారం తన వ్యవసాయ పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 18, 2026 / 10:00 AM IST

మండలంలో ఉచిత హెల్త్ కిట్ల పంపిణీ

VKB: పులిమామిడికి చెందిన సామాజికవేత్త రత్న మొల్ల రవీందర్ రెడ్డి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. నవాబుపేట్ మండలంలోని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) తో పాటు చించేల్‌పేట్, గంగ్యడ గ్రామాల్లో ఆయన స్వచ్ఛందంగా హెల్త్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో PHC డాక్టర్ రోహిత్, ANMలు, ఆశా వర్కర్లు పాల్గొని కిట్లను స్వీకరించారు.

March 18, 2026 / 10:00 AM IST