MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ పరిధి సాయి కాలనీ, శ్రీనివాస కాలనీలలో నల్లాల ద్వారా గత నాలుగు రోజులుగా అపరిశుభ్రమైన మంచినీరు సరఫరా అవుతోంది. రోడ్డు విస్తరణలో భాగంగా పాత పైపు లైన్ స్థానంలో ఏర్పాటు చేసిన కొత్త పైపు లైన్లో పేరుకుపోయిన మట్టితో కూడిన నీరు నల్లాల ద్వారా వస్తుండడంతో తాగలేని పరిస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు.