ఎన్టీఆర్: నందిగామ పరిధిలోని గాంధీ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. రానున్న వేసవి నేపథ్యంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన వారిని ఎమ్మెల్యే సౌమ్య అభినందించారు.