VSP: పద్మనాభ మండలం పొట్నూరు గ్రామానికి చెందిన అవునాపు ఆశీష్ బుధవారం విడుదలైన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటాడు. 100 మార్కులకు గాను 97.5 మార్కులుతో ఆల్ ఇండియా 6వ ర్యాంక్ సాధించినట్లు అతని తల్లిదండ్రులు తెలిపారు. విద్యార్థి ప్రతిభను గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు.