బాపట్ల: రేపల్లెలో బాలభక్త బృందం ఆధ్వర్యంలో పాత స్టేట్ బ్యాంకు సెంటర్ వద్ద 60వ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. గురువారం జరిగిన చలువ పందిరి గుంజ పూజలో టీడీపీ నేత అనగాని శివప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ మహోత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి భక్తులు, నిర్వాహకులు హాజరయ్యారు.