కృష్ణా: ఉగాది పండుగను పురస్కరించుకొని గుడివాడ మండలం జగన్నాధపురంలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించి, స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు.