TG: శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయం తరపున మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. ఆహ్వానించిన వారిలో దేవాదాయశాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఈవో ఉన్నారు. కాగా, ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 27న సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం జరగనుంది.