KMR: పంట సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి బుధవారం నాలుగో విడత నీటిని విడుదల చేశారు. 1,700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.919 టీఎంసీల నీటి నిల్వ ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయా పరిధిలోని రైతులు ఈ నీటిని సద్వినియోగం చేసుకుని పంటలను కాపాడుకోవాలన్నారు.