• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రావులపాలెం అదనపు ఎస్సైగా రమణారెడ్డి

కోనసీమ: ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రమణారెడ్డి ఎస్సైగా పదోన్నతి పొందారు. ఇటీవల ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఉత్తర్వులు మేరకు పదోన్నతి లభించడంతో కోనసీమ జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు… రమణారెడ్డిని రావులపాలెం అదనపు ఎస్సైగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం రమణారెడ్డి రావులపాలెం అదనపు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు.

April 4, 2025 / 04:07 PM IST

పల్లె పండగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: గండేపల్లి మండలం మురారి గ్రామంలో శుక్రవారం పల్లె పండగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు పాల్గొని రూ.1.5 కోట్లతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్, జడ్ రాగంపేట సర్పంచ్ కందుల చిట్టిబాబు, గ్రామస్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

April 4, 2025 / 03:45 PM IST

వైభవంగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

కోనసీమ: మామిడికుదురు పెరెళ్ల కాలువ గట్టు వద్ద ఉన్న రామాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం వైభవంగా జరిగింది. అర్చకులు సుదర్శనం వెంకట శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామికి తమలపాకులు, గంధ సింధూరంతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు.

April 4, 2025 / 03:30 PM IST

కోల్‌కతా హైకోర్టు కీలక ఆదేశాలు

ST సర్టిఫికెట్ జారీ విషయంలో కోల్‌కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఓ నీట్ అభ్యర్థి ST సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా అతడి తండ్రి ఫార్వర్డ్ కమ్యూనిటీ వ్యక్తి అని అధికారులు తిరస్కరించారు. దీనిపై అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించాడు. పేరెంట్స్‌లో ఒకరు ట్రైబల్ కాదనే కారణంతో ST సర్టిఫికెట్ నిరాకరించడం సరికాదని.. వెంటనే ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

April 4, 2025 / 02:24 PM IST

‘ఆరెళ్ల లోపు పిల్లలందరినీ అంగన్వాడిల్లో చేర్పించాలి’

KNR: ఆరు సంవత్సరాలలోపు పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తల్లిదండ్రులకు సూచించారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు.

April 4, 2025 / 02:23 PM IST

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

TG: ఖమ్మం జిల్లా బోదులబండలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల విషయంలో అధికారులు అలసత్వం వహించొద్దని సూచించారు. అరకిలో ధాన్యం తరుగు తీసినా కేసులు పెడతామని హెచ్చరించారు. రూ.20,609 కోట్ల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. శ్రీరామ నవమి తర్వాత ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని స్పష్టం చేశారు.

April 4, 2025 / 02:22 PM IST

రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

TPT: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. శుక్రవారం తిరుపతి గ్రామీణ మండలం దుర్గ సముద్రంలో రైతులకు రాయితీపై పనిముట్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రాయితీపై ఎరువులు, పనిముట్లు పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు.

April 4, 2025 / 02:20 PM IST

లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి ఎదురుదెబ్బ

AP: లిక్కర్ స్కాంలో వైఎస్ జగన్ సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కేసులో సాక్షిగా హాజరుకావాలని ఇటీవల కసిరెడ్డికి సీఐడీ నోటీసులు ఇవ్వగా.. వీటిని కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది. కసిరెడ్డికి మరోసారి నోటీసులు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.

April 4, 2025 / 02:18 PM IST

ఎంపీని కలిసిన కడప జెడ్పీ ఛైర్మన్

KDP: హైదరాబాదులో ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో శుక్రవారం ఆయనను జిల్లా జెడ్పీ ఛైర్మన్ ముత్యాల రామ గోవిందు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.  కడప జెడ్పీ ఛైర్మన్‌గా సహాయ సహకారాలు అందించిన ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎంపీ అవినాష్‌ను శాలువ, పూలమాలతో సత్కరించారు. ఈయన వెంట సంబుటూరు ప్రసాద్ రెడ్డి ఉన్నారు.

April 4, 2025 / 02:10 PM IST

‘వైసీపీ కార్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలిన’

KDP: ముద్దనూరు మండల కేంద్రంలో ఎర్రగుంట్ల పోయే రోడ్డు పక్కన వైసీపీ నూతన కార్యాలయం ఏర్పాటుకు జమ్మలమడుగు మాజీ MLA డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ముద్దనూరు, ఎర్రగుంట్ల మండల వైసీపీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, జయరాంరెడ్డి, సన్నీ, మణికంఠ రెడ్డి పాల్గొన్నారు.

April 4, 2025 / 02:07 PM IST

‘రెడ్డి రాజుల మృతి పార్టీకి తీరని లోటు’

అన్నమయ్య: రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ మచ్చు వారి పల్లెకు చెందిన వైసీపీ నేత రెడ్డి రాజులు ఆకస్మిక మరణం చెందారు. ఆ పార్టీ నియోజకవర్గం ఇంఛార్జి నిస్సార్ అహ్మద్ ఆయన భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. రెడ్డి రాజుల మృతి పార్టీకి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు.

April 4, 2025 / 02:05 PM IST

‘చట్టాలపై విద్యార్థులకు అవగాహన’

PDPL: రామగుండం కమిషనరేట్ షీటీం ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ సహా ఇతర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలపై వివరించారు. సమాజంలో మహిళల భద్రత, హక్కులపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా 1091 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

April 4, 2025 / 01:59 PM IST

అమ్మవారి ఆలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు

ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం అవోపా వారి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. అవోపా ప్రెసిడెంట్ రాము మాట్లాడుతూ.. వేసవికాలంలో ప్రజల సౌకర్యార్థం ఈ ఉచిత చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. చలివేంద్రం మొదటి రోజు మజ్జిగను పంపిణీ చేశారు. ముందుగా అమ్మవారి చిత్రపటానికి పూజలు చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.

April 4, 2025 / 01:53 PM IST

కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోAI శిక్షణ

PDPL: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు.గత నెల 15వ తేదీ నుంచి పెద్దపల్లి జిల్లాలోని 15 ప్రాథమిక పాఠశాలల్లో 3,4, 5 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుపై శిక్షణ ఇస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు అందిస్తున్నామని సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.

April 4, 2025 / 01:53 PM IST

“సన్న బియ్యం పంపిణీ ప్రారంభం”

NGKL: అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరి నారాయణ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలు సంపన్నులతో సమానంగా భోజనం చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని వెల్లడించారు.

April 4, 2025 / 01:47 PM IST