NZB: బీసీలకు రానున్న బడ్జెట్లో రూ.50 వేల కోట్లు కేటాయించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుస్సాపూర్ శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం నిజామాబాద్లో R&B గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలన్నారు. బీసీ సబ్ ప్లాన్ను ప్రవేశపెట్టాలని, బీసీ చట్టం తీసుకురావాలని కోరారు.
NRPT: మరికల్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో యాచిస్తూ జీవనం కొనసాగిస్తున్న ధన్వాడకు చెందిన లలిత (65) మంగళవారం అర్ధరాత్రి మృతి చెందింది. లలిత భర్త గత ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, ఒంటరిగా ఉంటూ గ్రామంలో యాచిస్తూ జీవనం కొనసాగిస్తుండేది. లలిత ధన్వాడ మండల కేంద్రానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు.
GNTR: తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని కంపోస్ట్ యార్డును ఢిల్లీ నుంచి వచ్చిన బృందం సందర్శించింది. ఘన వ్యర్థాల నిర్వహణ విధానాలను సమీక్షిస్తూ వర్మీ కంపోస్ట్, ఆర్గానిక్ యూనిట్లు, కోకో పిట్ కేంద్రం, ఎన్టీపీ ప్లాంట్ పనితీరును పరిశీలించింది. సంబంధిత వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు, అధికారులు పాల్గొన్నారు.
NLG: చిట్యాల మండలం తాళ్ల వెల్లంలలో సాగునీటి కొరత రైతులను కుదిపేస్తోంది. బోర్లపై ఆధారపడి సాగు చేసిన వరి పంటలు కంకి దశలోనే ఎండిపోయాయి. మహిళా కౌలు రైతు పార్వతమ్మ ఒకటిన్నర ఎకరాల్లో వేసిన పంట పూర్తిగా నష్టపోయింది. భూగర్భ జలాలు తగ్గడంతో చివరకు పశువుల మేపుకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
NLG: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఇవాళ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ‘సర్వేజనా సుఖినోభవంతు’ అని ఆకాంక్షించారు.
నోరా ఫతేహి నటించిన ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాట వివాదంపై గీత రచయిత రఖీబ్ ఆలం స్పందించాడు. ఈ పాటలోని అసభ్య పదజాలంపై వస్తున్న విమర్శలపై ఆయన వివరణ ఇచ్చాడు. దర్శకుడు ప్రేమ్ ఒత్తిడి వల్లే కన్నడ సాహిత్యాన్ని హిందీలోకి అనువదించాల్సి వచ్చిందని, కొన్ని లైన్లు ద్వంద్వార్థాన్ని ఇస్తున్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. సెన్సార్ సమస్యలు వస్తాయని ముందే హెచ్చరించినా టీమ్ వినలేదని తెలిపాడు.
SKLM: చరిత్ర కలిగిన పాతపట్నం శ్రీ నీలకంటేశ్వర స్వామికి పాల్గొన్న మాసం అమావాస్య తిధి బుధవారం భక్తులు దర్శించి పూజలు నిర్వహించారు. మహేంద్ర తనయ నది పక్కన అద్భుతంగా భక్తుల్ని ఆకట్టుకునే విధంగా స్వామివారి దర్శనం ఇచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ అర్చకులు స్వామిని అలంకరించి భక్తుల దర్శనార్థం పూజలు నిర్వహించారు.
W.G: ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించడంలో ప్రతి శాఖ కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. మంగళవారం పెదమిరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జీఎస్టీ సమన్వయ సమావేశం జరిగింది. వాణిజ్య పన్నుల శాఖ, ఇతర ఆదాయార్జన శాఖల అధికారులు పాల్గొన్న ఈ సభలో.. పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు.
CTR: పెద్దపంజాణి మండలం నేలపల్లెకు చెందిన తొండవాని పురుషోత్తమాచార్య అలియాస్ @జక్కన్న రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉగాది పురస్కారానికి ఎన్నికయ్యారు. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శిల్పకళా రంగంలో కళారత్న పురస్కారం-2026 అందజేయనున్నట్లు రచయిత బాలాజీ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డు, రూ. 50 వేల నగదు అందుకోనున్నారు.
MBNR: ఇరాన్- ఇజ్రాయిల్ ఉద్రిక్తతల నేపథ్యంలో జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా, బ్లాక్ మార్కెట్ నియంత్రణకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ హరిప్రియ తెలిపారు. హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్ల అక్రమ నిల్వలపై ఫిర్యాదులు స్వీకరిస్తారు. వివరాలకు సీనియర్ అసిస్టెంట్ దేవేందర్ రెడ్డి 9666052780, 9912659005 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
NDL: బనగానపల్లి మండలం పెద్దరాజు పల్లి గ్రామంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో రూ. 25 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వంలో కంటే కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి అన్నారు.
MDK: చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామ అంబేద్కర్ యువజన సంఘం ‘మై భారత్’ కార్యక్రమానికి ఎంపికైంది. ఈ సందర్భంగా యువజన సంఘాలను ప్రోత్సహించే లక్ష్యంతో మై భారత్ ప్రోగ్రాం ఆఫీసర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా సంఘం సభ్యులకు స్పోర్ట్స్ కిట్ను అందజేశారు. క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో యువత రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు లింగం గౌడ్, యువజన సంఘం సభ్యులు పాల్గొన్...
ASF: వాంకిడి మండలం నార్లపూర్ గ్రామంలో జరిగిన పోచమ్మ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన విందు భోజనం తిన్న 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన తల్లిదండ్రులు విద్యార్థులను వాంకిడి ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. భోజనంలో బల్లి పడటమే దీనికి కారణమని భావిస్తున్నారు.
VZM: పంచాయతీల అభివృద్ధికి ఇంటి పన్నులు కీలమని చీపురుపల్లి ఎంపీడీవో ఐ.సురేశ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో 16,000 ఇళ్లకు 12,000 ఇళ్ల వారు పన్నులు చెల్లించారన్నారు. మిగిలిన వారు త్వరగా చెల్లించాలని కోరారు. చీపురుపల్లి మేజర్ పంచాయతీలో రూ.34 లక్షలు బకాయిలు ఉన్నాయన్నారు.