NLG: చిట్యాల మండలం తాళ్ల వెల్లంలలో సాగునీటి కొరత రైతులను కుదిపేస్తోంది. బోర్లపై ఆధారపడి సాగు చేసిన వరి పంటలు కంకి దశలోనే ఎండిపోయాయి. మహిళా కౌలు రైతు పార్వతమ్మ ఒకటిన్నర ఎకరాల్లో వేసిన పంట పూర్తిగా నష్టపోయింది. భూగర్భ జలాలు తగ్గడంతో చివరకు పశువుల మేపుకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.