వనపర్తి జిల్లా లోని 19వ వార్డులో గత వారం రోజులుగా మంచినీటి సమస్య నెలకొందని వెంటనే పరిష్కారం చూపాలని కౌన్సిలర్ మురళి సాగర్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది ఉగాది, రంజాన్ పండుగలు ఏకకాలంలో రావడం వల్ల మంచినీటి వాడకం అధికంగా ఉంటుందని దానిని దృష్టిలో ఉంచుకుని లీకేజీలు, నిరంతరం మంచినీటి పంపిణీని చేపట్టాలని వినతిపత్రం అందజేశారు.