MDK: కాళేశ్వరం ప్రాజెక్టు నీరు రామాయంపేట మండలం డి. ధర్మారం గ్రామానికి చేరుకోవడంతో కెనాల్ కాల్వ నిండుగా ప్రవహిస్తోంది. దీనిపై గ్రామ సర్పంచ్ బండారు శ్రీనివాస్ గౌడ్, మహేందర్ గౌడ్, వార్డు సభ్యులు, వ్యవసాయదారులు హర్షం వ్యక్తం చేశారు. సాగునీరు పుష్కలంగా అందడంతో వరి పంటలు బాగా పండుతాయని ధీమా వ్యక్తం చేస్తూ, నీటిని విడుదల చేసిన ప్రభుత్వానికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.