CTR: పెద్దపంజాణి మండలం నేలపల్లెకు చెందిన తొండవాని పురుషోత్తమాచార్య అలియాస్ @జక్కన్న రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉగాది పురస్కారానికి ఎన్నికయ్యారు. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శిల్పకళా రంగంలో కళారత్న పురస్కారం-2026 అందజేయనున్నట్లు రచయిత బాలాజీ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డు, రూ. 50 వేల నగదు అందుకోనున్నారు.