KRNL: నందవరం మండలం నాగలదిన్నె హైస్కూల్లో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు. CM చంద్రబాబు చేతుల మీదుగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
చిత్తూరు జిల్లా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలో ఇంకా ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 23 లోగా సరైన ఆధారాలతో జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో అందజేయాలని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇప్పటికే ఓ సారి అభ్యంతరాలు స్వీకరించి జాబితాను సరిచేసి ఉప, మండల విద్యాశాఖాధికారులు వెబ్సైట్లో పెట్టినట్లు చెప్పారు. అభ్యంతరాలు తెలిపేవారు డీఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
SKLM: ఆమదాలవలస మండలం వెంగల రావు కాలనీలో ఎన్ అపర్ణ అనే గర్భిణి మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు వెంటనే అడ్డుకుని ఆమెను 108 అంబులెన్స్ ద్వారా జేమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. తల్లి, బిడ్డలకు చికిత్స అందుతోందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలరాజు తెలిపారు.
దర్శకుడు ప్రేమ్ రూపొందిస్తున్న ‘కేడీ: ది డెవిల్’ మూవీలోని ‘సర్కే చునార్ తేరీ సర్కే’ సాంగ్ వివాదంపై ఆయన భార్య నటి రక్షిత ఇన్స్టా వేదికగా స్పందించింది. గతంలో శృంగారభరిత సినిమాలు వచ్చినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని ఆమె ప్రశ్నించింది. విమర్శించే హక్కు ఉన్నా, వ్యక్తిగత దూషణలు చేయడం బాధాకరమని పేర్కొంటూ.. సినిమాపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేసింది.
JGL: గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో విద్యుత్ అధికారులు ‘ప్రజాబాట’ కార్యక్రమం నిర్వహించారు. ఓవర్లోడ్ DTRకు అదనంగా 63 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ పనులకు రూ.2 లక్షలు, ట్రాన్స్ ఫార్మర్కు రూ.4 లక్షలు ఖర్చు కాగా, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారం అందించారని అధికారులు తెలిపారు. సమస్యలు తీరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NLR: ఇందుకురుపేట మండలంలోని మైపాడులో కొందరు యువకులు వ్యాపారులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగార్జునరెడ్డి బుధవారం తెలిపారు. కటారి తరుణ్, మేకల సునీల్, బతాని నరేంద్ర, ఎస్.కే. అల్తాఫ్ సెంటర్లో బైక్ హారన్లతో స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తుండగా మందలించడంతో వారు దాడి చేసినట్లు ఎస్సై నాగార్జునరెడ్డి తెలిపారు.
NDL: పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సతీమణి కాటసాని జయమ్మ పర్యటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆమె స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
AKP: సబ్బవరం మండలం గుల్లేపల్లి పీహెచ్సీలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఎంపీపీ బి.సూర్యకుమారి మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి డాక్టర్ దమయంతి, సర్పంచ్ మంగ పాల్గొన్నారు.
నెల్లూరు: నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక విభాగంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలకు ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత వైసీపీ హయాంలో అనుమతులు లేని లేఅవుట్లలో భవన నిర్మాణాలకు అనుమతులు, పట్టణ ప్రణాళిక నిబంధనల ఉల్లంఘన వంటి వాటిపై గతంలో ఫిర్యాదులు అందాయి.
TPT: వెంకటగిరి మండలం యాతలూరులో రైతన్న మీకోసం జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ పునుగోటి విశ్వనాథం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. రైతులు ధాన్యం అమ్మకాల్లో మోసపోకుండా ఉండేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. ఆయన వెంట వ్యవసాయాధికారులు సుజాత ఉన్నారు.
MBNR: పిడుగు పడి పాడి ఆవు మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలం తిరుమలగిరి గ్రామపంచాయతీ పరిధిలోని కిచ్య నాయక్ తండాలో మంగళవారం రాత్రి జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాట్లవత్ మోహన్ తన ఆవులను మంగళవారం సాయంత్రం తన పొలంలో కట్టేసి ఇంటికి వచ్చాడు. ఇవాళ ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా.. పిడుగు పడి ఆవు మృతి చెందింది.
KMR: గడిచిన 24 గంటల్లో జిల్లాలో వాతావరణం భిన్నంగా మారింది. మధ్యాహ్నం ఉక్కపోత, రాత్రి వర్షం, ఉదయం చలి గాలులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సోమూర్లో అత్యధికంగా 13.3 మి.మీ వర్షపాతం నమోదు కాగా, బిక్కనూరులో 38.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జుక్కల్, డోంగ్లి, బీర్కూర్ ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది.
ATP: తాడిపత్రి మున్సిపాలిటీ పాలక వర్గం గడువు ముగియడంతో ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. దేవాలయం లాంటి కార్యాలయాన్ని వీడాల్సి రావడం బాధగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఐదేళ్ల కాలంలో తాడిపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. కౌన్సిలర్లు, అధికారులు అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
E.G: 2014లో MLAగా గెలిచిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి MP మురళీమోహన్ సహకారంతో అనపర్తి వాసుల కలలను సాకారం చేశారు. 2016లో రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి హాల్ట్ తీసుకువచ్చి అనపర్తి రైల్వే స్టేషన్ దశను, దిశను మార్చి వేశారు. అనపర్తి స్టేషన్కి తొలి సెకండ్ సిట్టింగ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రత్నాచల్ కావడం విశేషం.
ప్రకాశం: కంభంలోని MPDO కార్యాలయంలో మంగళవారం MPTCలకు వార్డు సభ్యులకు సస్టైనబుల్ డెలప్ మెంట్ గోల్స్ స్థానికీకరణపై శిక్షణ నిర్వహించారు. MPDO వీరభద్రచారి మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను మెరుగుపరచడానికి ప్రజల జీవన ప్రమాణాలను ఎలా పెంచాలో MPTCలకు వార్డు సభ్యులకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో MPTCలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.