• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పార్టీ సీనియర్ నాయకులతో జగన్ సమావేశం

AP: వైసీపీ సీనియర్ నాయకులతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో జగన్ చర్చించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఇతర సీనియర్ నేతలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

February 11, 2025 / 05:15 PM IST

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు

ATP: తాడిపత్రి చుట్టుపక్కల ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్రదేశాలను పోలీసులు మంగళవారం తనిఖీ చేశారు. తాడిపత్రి రూరల్ ఎస్ఐలు ధరణి బాబు, కాటమయ్య కలిసి తనిఖీలు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలని స్థానికులకు సూచించారు.

February 11, 2025 / 04:32 PM IST

విరువూరులో 104 వాహన వైద్య సేవలు

NLR: వరికుంటపాడు మండలంలోని ఇరువురు గ్రామంలో మంగళవారం మండల వైద్యాధికారిని ఆయేషా 104 వాహన వైద్య సేవలను అందించారు. ఆమె 53 మందిని పరీక్షించి ఉచితంగా మందులు అందించారు. అలాగే ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. దీర్ఘకాలిక రోగులు మారిన వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చలికాలంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

February 11, 2025 / 03:04 PM IST

రోడ్డు ప్రమాదంపై బండి సంజయ్ దిగ్భ్రాంతి

మధ్యప్రదేశ్ రోడ్డు ప్రమాదంపై కేంద్రమంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జబల్‌పూర్ కలెక్టర్, ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. బాధితులకు అన్ని రకాలుగా సాయం అందేలా చూడాలని చెప్పారు. మృతదేహాలకు వెంటనే పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అందించాలని కోరారు. కాగా.. కుంభమేళాకు వెళ్లి వస్తుండగా జబల్‌పూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించిన విషయం తెలిసిందే.

February 11, 2025 / 02:21 PM IST

జబల్‌పుర్‌ రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

TG: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో హైదరాబాద్‌లోని నాచారం ఏరియాకు చెందిన 8 మంది చనిపోయినట్లు సమాచారం అందటంతో.. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన సహాయక చర్యలు త్వరిగతిన చేపట్టాలని సీఎం ఆదేశించారు.

February 11, 2025 / 02:21 PM IST

సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

VZM: దత్తిరాజేరు మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. ఇందులో ప్రధానంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో రాజేంద్రప్రసాద్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సింహాద్రి అప్పలనాయుడు, జెడ్పీటీసీ రౌతు రాజేశ్వరి, వైస్‌ ఎంపీపీ మిత్తిరెడ్డి రమేశ్‌ నాయుడు పాల్గొన్నారు.

February 11, 2025 / 02:20 PM IST

మాజీ ఎంపీ వినోద్ ఆసక్తికర వ్యాఖ్యలు

TG: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో తమ పార్టీ నేతలు నిరాశలో ఉన్నారని మాజీ ఎంపీ వినోద్ తెలిపారు. ఉన్నమాటే చెబుతున్నానని.. దీనిలో దాపరికం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఓటరు నమోదు కార్యక్రమంలో తాము పాల్గొనలేదని.. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని చెప్పారు. కులగణన నుంచి తప్పించుకోవడానికే కేంద్రం జనగణన చేయడం లేదని విమర్శించారు.

February 11, 2025 / 02:19 PM IST

అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

NGKL: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా మైనింగ్ చేస్తే వారిపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, మైనింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

February 11, 2025 / 02:09 PM IST

‘సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలి’

ATP: గుంతకల్లులోని ఓ ప్రైవేటు కళాశాలలో సైబర్ నేరాలపై మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టు టౌన్ సీఐ మస్తాన్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు.

February 11, 2025 / 01:57 PM IST

రేపే జాబ్ మేళా

NGKL: జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐ.టీ.ఐ కళాశాలలో ఈనెల 12వ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి బి.రాఘవేందర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డి. ఫార్మసి, బి. ఫార్మసీ, డిప్లొమో ఇన్ అగ్రికల్చర్, డిప్లొమో ఇన్ హార్టి కల్చర్ చదివిన 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉన్న నిరుద్యోగులు అర్హులన్నారు. ఈ ఆవకాశంను నిరుద్యోగులు వినియోగించుకోవాలన్నారు.

February 11, 2025 / 01:50 PM IST

మల్లన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్

JGL: వేములవాడ నియోజకవర్గం పరిధిలోని భీమారం మండలం మన్నెగూడెం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ప్రభుత్వ విప్‌ను ఘనంగా సన్మానించారు.

February 11, 2025 / 01:38 PM IST

‘మూడు నెలలు చికెన్ షాపులు మూసివేత’

W.G: వేల్పూరులోని కృష్ణానందం పౌల్ట్రీ నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూ పాజిటివ్ నిర్ధారణ అయిందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. వాటిని అరికట్టేందుకు అన్ని రకాల అత్యవసర చర్యలను చేపట్టాని, 3నెలల పాటు ఇన్ఫెక్షన్ జోన్లోని కోళ్ల ఫారాలు, షాపులు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. పెద్దఅమిరం కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

February 11, 2025 / 01:36 PM IST

నవగ్రహ సుబ్రహ్మణ్య ధ్వజ శిఖర ప్రతిష్ట పూజకు విరాళం

ATP: గుంతకల్లులో కోదండ రామస్వామి ఆలయంలో నూతన నవగ్రహ సుబ్రహ్మణ్య ధ్వజ శిఖర ప్రతిష్ట పూజా కార్యక్రమానికి టీడీపీ గుంతకల్లు మండల ఇంచఛార్జ్ నారాయణస్వామి, టీడీపీ నాయకులతో కలిసి మంగళవారం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు రూ. 30,000 విరాళం అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు నారాయణస్వామిని శాలువాతో సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

February 11, 2025 / 01:34 PM IST

పేదలకు ఇంటి స్థలం కోసం పోరుబాట

VZM: కూటమి ప్రభుత్వ ఎన్నికల హమీలో బాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు హామీ అమలు చేసే వరకు భారత కమ్యునిస్టు పార్టీ పోరుబాట కొనసాగుతుందని నియోజకవర్గ కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు. మంగళవారం డి.ఎన్.ఆర్ అమర్ భవన్‌లో పేదల ఇంటి స్థలం కోసం సీపీఐ పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన ప్రచార గోడ పత్రికలను విడుదల చేశారు.

February 11, 2025 / 01:33 PM IST

కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి

SKLM: మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని, లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని సీఐటీయూ టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు అన్నారు. నగరంలోని మాస్టర్ల పాయింట్ల వద్ద మంగళవారం నిరసన తెలిపారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులతో ఊడిగం చేయించుకుంటున్నాయని, వారికి ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.

February 11, 2025 / 01:32 PM IST