KDP: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కడపలోని నూర్జహాన్ కళ్యాణ మండపంలో ఇఫ్తార్ విందు జరగనుంది. కాగా, ముస్లిం సోదరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం గురువులు పాల్గొంటారన్నారు.