AP: వేసవి ఎండల నుంచి వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు అనంతపురంలోని సప్తగిరి కూడలిలో ‘ఓపెన్ స్పేస్ కూలింగ్ సిస్టం’ ఏర్పాటు చేశారు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు నీటి తుంపరల ద్వారా ఈ వ్యవస్థ చల్లదనాన్ని అందిస్తుంది. టీచర్ సురేష్ నాయక్ సూచనతో మున్సిపల్ అధికారులు రాష్ట్రంలోనే తొలిసారిగా దీనిని అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ట్రయల్ రన్ కొనసాగుతోంది.