బాపట్ల మండలంలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి బొత్స దిలీప్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుక్కలవారిపాలెం చెరువులో మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల తెలియాల్సి ఉంది.