బాపట్ల: పంగులూరు మండలం, పంగులూరు గ్రామంలో రంజాన్ సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో అద్దంకి మాజీ ఎమ్మెల్యే డా. బాచిన చెంచు గరటయ్య, యువ నాయకుడు బాచిన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ZPTC నాయకుడు రాయుని వెంకట సుబ్బారావు, మండల ఉపాధ్యక్షుడు యర్రం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.