E.G: చారిత్రక కడియం బొబ్బిలి బ్రిడ్జి సెంటర్ను విస్తరించి, వ్యాపార, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. కడియం మండల టీడీపీ అధ్యక్షుడు వెలుగుబంటి నాని ఆధ్వర్యంలో స్థానిక మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ.. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.