TPT: చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లెలోని క్వారీల్లో పేలుళ్లు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. పేలుళ్ల ధాటికి కొండపై నుంచి భారీ బండరాయి దొర్లుకుంటూ వచ్చి చంద్రగిరి-నాగయ్య గారిపల్లె రోడ్డుపై పడింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. పేలుళ్ల శబ్దానికి అంజనేయపురం గ్రామంలోని ఇళ్లు కంపించాయని స్థానికులు తెలిపారు.