NRPT: దామరగిద్ద మండలానికి చెందిన పలువురు రైతులు క్షేత్ర పర్యటనలో భాగంగా సిద్దిపేట జిల్లా చేర్యాలను సందర్శించారు. అక్కడ అమలవుతున్న సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై నిపుణుల ద్వారా అవగాహన పెంపొందించుకున్నారు. రసాయన ఎరువులు లేకుండా జీవామృతం తయారీ, మట్టి సారాన్ని కాపాడుకుంటూ పంటలు సాగు చేసే విధానాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.