VSP: ఏయూ పరీక్షల ఫలితాలను విద్యార్థులు నేరుగా వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చని వీసీ ఆచార్య జీ.పీ. రాజశేఖర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మనమిత్ర యాప్ ఉపయోగించి ఫలితాలు పొందే విధానాన్ని డెమో ద్వారా ప్రత్యక్షంగా చూపించారు. అనంతరం ఏయూ విద్యార్థిని వాట్సాప్ ఉపయోగించి తన రిజిస్టర్ నంబర్లో ఫలితాలు పొందే విధానం లైవ్లో చూపించారు.