KDP: ఒంటిమిట్ట మండలంలోని దర్జపల్లి గ్రామానికి ఉచిత RTC పల్లె వెలుగు బస్సును చమర్తి జగన్మోహన్ రాజు ప్రారంభించబోతున్నట్లు ఒంటిమిట్ట టీడీపీ శ్రేణులు తెలిపారు. ఒంటిమిట్ట నుంచి దర్జపల్లి వరకు మొత్తం 9 గ్రామాల ప్రజలకు ఈ ఉచిత బస్సు సౌకర్యం ఊరటను ఇస్తుందని అంటున్నారు. పరీక్షలకు వెళ్లే కళాశాల, పాఠశాల విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.