SDPT: బెజ్జంకి మండలంలో ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా సర్పంచ్ బొల్లం శ్రీధర్ పెద్దన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కలసి ధైర్యం చెప్పారు. భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కష్టపడి చదివితే విజయాన్ని సాధించవచ్చని తెలిపారు.