• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సత్తెనపల్లిలో దామోదర సంజీవయ్య జయంతి

PLD: సత్తెనపల్లిలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ సమన్వయకర్త  గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ లక్ష్మీ తులసి సాంబశివరావు, వైస్ ఛైర్మన్ కోటేశ్వర నాయక్ పాల్గొన్నారు.

February 14, 2025 / 01:43 PM IST

ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి

ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎంపీపీ హైస్కూల్ వద్ద శుక్రవారం విద్యార్థులు, తల్లిదండ్రులు, హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. హిందూ దేవుళ్లను కించపరుస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం బోధనలు చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు అన్యమత బోధన చేస్తున్నాడని వచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు. 

February 14, 2025 / 01:40 PM IST

ఇండ్ల స్థలాల కోసం నిరసన

ATP: తాడిపత్రి పట్టణంలో ఇండ్ల స్థలాల కోసం ఎంహెచ్‌‌పీఎస్ నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంహెచ్‌పీఎస్ నాయకులు కార్యకర్తలు కలిసి తప్పెట్లతో ధర్నా చేశారు. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి నాకు మాత్రం ఇళ్ల స్థలాలు రాలేదని వారు ఆవేదన చెందారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు అన్నారు.

February 14, 2025 / 01:39 PM IST

HYD రోడ్డుప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన BMW కారు

HYD: పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నక్కవాగు సమీపంలో ముందు వెళ్తున్న ఆటో ట్రాలీని బీఎండబ్ల్యూ కారు ఢీకొనడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారు నడుపుతున్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా.. డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

February 14, 2025 / 01:26 PM IST

డంపింగ్‌ యార్డ్ తరలించారని హరీష్ రావు డిమాండ్

SRD: గుమ్మడిదల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వెంటనే మరో ప్రాంతానికి తరలించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు డంపింగ్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకంగా దీక్ష చేపడుతున్న వారికి ఆయన మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎమర్జెన్సీ ని తలపించేలా ఉందన్నారు.

February 14, 2025 / 12:54 PM IST

లారీ, బస్సు ఢీ.. 10 మందికి తీవ్ర గాయాలు

KMR: జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై నిజాంబాద్ నుండి కామారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో పదిమందికి ప్రయాణికులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు ప్రయాణికులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

February 14, 2025 / 12:49 PM IST

గర్భిణీ మహిళలకు ప్రత్యేక శిబిరం

KMR: డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇవాళ గర్భిణీ మహిళలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీ లేఖ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీ మహిళలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించి, రక్తనమూనాలు సేకరించి మందులు పంపిణీ చేశామన్నారు. అనంతరం గర్భిణీలకు పలు ఆరోగ్య సూచనలు చేశారు.

February 14, 2025 / 12:47 PM IST

బాపట్లలో డ్రైవర్లకు వైద్య శిబిరం

బాపట్ల: 36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు బాపట్ల పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డీఎంహెచ్ఓ విజయమ్మ, వైద్యులు పాల్గొని డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. రాబోయే వేసవి కాలం దృష్ట్యా డ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

February 14, 2025 / 12:42 PM IST

తాళ్లూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ

ప్రకాశం: తాళ్లూరు పోలీస్ స్టేషన్‌ను దర్శి డీఎస్పీ లక్ష్మీ నారాయణ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలను, రిజిష్టర్లను పరిశీలించారు. రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేసి పోలీస్ స్టేషన్లో సిబ్బంది యొక్క పనితీరును డీఎస్పీ అడిగి తెలుసుకున్నారు.

February 14, 2025 / 12:42 PM IST

బాన్సువాడలో వాహనాల తనిఖీ

KMR: బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై అశోక్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరి వాహనానికి సంబంధించిన ధృవపత్రాలతోపాటు నంబర్ ప్లేట్‌ సరిగా ఉంచుకోవాలన్నారు. హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది శంకర్ పాల్గొన్నారు.

February 14, 2025 / 12:41 PM IST

నూతనంగా ఎన్నికైన జర్నలిస్టులకు సన్మానం

JGL: టీయూడబ్ల్యూజేహెచ్ 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంగుల రాంగోపాల్, జిల్లా అధ్యక్షుడిగా శికారి రామకృష్ణ ఎలాక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడుగా దొమ్మాటి అంజుగౌడ్, జిల్లా కోశాధికారిగా కటుకం రాజేశ్ ఇటీవల ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం కోరుట్లలో అడ్వకేట్ తోకల రమేశ్ వారికి సన్మానం చేశారు. కోరుట్ల ప్రాంతానికి చెందిన నలుగురికి బాధ్యతలు రావటం అభినందనీయమని అన్నారు.

February 14, 2025 / 12:39 PM IST

టోల్ ప్లాజా సిబ్బందికి వినతి పత్రం అందజేత

KMR: బిక్కనూరు మండలానికి చెందిన ఫోర్ వీల్ వాహనాలకు ఎలాంటి టోల్ ఫీజు తీసుకోకుండా ఉచిత అనుమతి ఇవ్వాలని పట్టణ తుఫాన్ వాహన అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు టోల్ ప్లాజా సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. స్థానిక వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో యాజమాన్యం తగు నిర్ణయాలు తీసుకొని అనుమతి ఇవ్వాలని కోరారు.

February 14, 2025 / 12:39 PM IST

దామోదర్ సంజీవయ్యకి నివాళులర్పించిన మంత్రి, కలెక్టర్

ప్రకాశం: మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా శుక్రవారం ఒంగోలులోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమంత్రిగా ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు.

February 14, 2025 / 12:19 PM IST

తెనాలిలో గుంటూరు ఎస్పీ పర్యటన

GNTR: ఎస్పీ సతీశ్ కుమార్ శుక్రవారం ఉదయం తెనాలి వచ్చారు. పోలీస్ పరేడ్‌లో పాల్గొన్న అనంతరం ఎస్పీ ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అందరూ కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పారు. క్రమశిక్షణతో మెలగాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని అన్నారు. తెనాలిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అనేక చర్యలు చేపడుతున్నామన్నారు.

February 14, 2025 / 12:17 PM IST

విద్యుత్ కోతతో ప్రజల అవస్థలు

కృష్ణా: ముసునూరు మండలం లోపూడిలో శుక్రవారం అప్రకటిత విద్యుత్ కోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి విద్యుత్ సరఫరా కాకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏవైనా మరమ్మత్తులు ఉంటే ముందుగానే విద్యుత్ కోత ప్రకటిస్తే అనుగుణంగా ముందుకు వెళతామంటూ ప్రజలు పేర్కొన్నారు. వ్యవసాయ, వ్యాపారాలకు విద్యుత్ కోత తీవ్ర అంతరాయం కలిగిందన్నారు.

February 14, 2025 / 12:11 PM IST