SDPT: బెజ్జంకి మండలంలో ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా సర్పంచ్ బొల్లం శ్రీధర్ పెద్దన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కలసి ధైర్యం చెప్పారు. భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కష్టపడి చదివితే విజయాన్ని సాధించవచ్చని తెలిపారు.
GDWL: వ్యర్థాలను రోడ్లపై వేసి ఆరోగ్య సమస్యలను, దోమల బెడదను కొని తెచ్చుకోవద్దు అని కౌన్సిలర్లు తిరుమలేష్, పాగుంట సువర్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయిజ మున్సిపాలిటీలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా 1వ, 12వ వార్డుల్లో శనివారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి మున్సిపాలిటీ వాహనాల ద్వారా తరలించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న ఈ చిత్రం గ్రాండ్గా విడుదల కానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక శ్రీలీల, రాశి ఖన్నా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
E.G: జనసేన పార్టీ 13 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్ అత్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక దేవిచౌక్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టారు. శనివారం ఉదయం చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్ర రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ డైరెక్టర్ గంటా స్వరూపరాణి హాజరై ఆహారాన్ని పంపిణీ చేశారు.
TG: మూసీ రివర్ ఫ్రంట్ మాస్టర్ ప్లాన్ను సింగపూర్కు చెందిన సంస్థ రూపొందించింది. ప్రధానంగా ఆరు ప్రధాన అంశాలుగా ప్రణాళికను తీసుకొచ్చింది. నదిపై వంతెనలు, రోడ్లు, ట్రంపెట్లతో పాటు నగరాన్ని, ఓఆర్ఆర్ను అనుసంధానించేలా ఎలివేటెడ్ కారిడార్లు, ప్రజలకు అనువైన రవాణా సౌకర్యాలు, రెస్టారెంట్లు, హోటళ్ల అభివృద్ధిని సంస్థ విశ్లేషించింది.
WNP: గోపాల్పేట్ మండల్ కేంద్రంలో మొదటి రోజు విద్యార్థులకు పరీక్ష కేంద్రానికి ఆర్థిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం అన్ని విధాలుగా పరీక్ష కేంద్రం చుట్టూ పోలీస్ బందోబస్తు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు.
NGKL: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో పదో తరగతి విద్యార్థుల సౌకర్యార్థం కోసం డిపో మేనేజర్ యాదయ్య ఆదేశాల మేరకు ఈరోజు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బస్సుల వేళలు, రూట్ల గురించి సమాచారం తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రయాణికులు, విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను ఇక్కడ తెలియజేయవచ్చన్నారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేసవి తీవ్రతతో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఉమ్మడి జిల్లాలో కేజీ స్కిన్ చికెన్ కిలో రూ. 320 నుంచి 330 మధ్య పలుకుతుండగా.. స్కిన్లెస్ చికెన్ రూ. 300 వరకు పలుకుతున్నట్లు విక్రయదారులు తెలిపారు. వేసవి వల్ల కోళ్లు చనిపోవడం, ఫాముల్లో ఉత్పత్తి తగ్గడంతో కొరత ఏర్పడిందని వ్యాపారులు వెల్లడించారు.
MDK: జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల కొరత లేకుండా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులతో సమీక్షించారు. అక్రమ నిల్వలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. గ్యాస్ బుకింగ్ల మధ్య పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల గ్యాప్ ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, నిరంతర సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.
TG: గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా దంపతులు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామి, అమ్మవార్ల మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు ఈవో ఘన స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు ఆలయంలో స్వామివారికి భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన పూజలోనూ పాల్గొన్నారు.
NLG: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం పశువైద్య సంవర్థక శాఖ ఆద్వర్యంలో టీకాలు వేసే కార్యక్రమం కట్టంగూరు మండలంలో ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 10న ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు వందల సంఖ్యలో తెల్లజాతి, నల్లజాతి పశువులకు టీకాలు వేశారు. ఇవాళ దుగినవెల్లిలో పశువులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర చెరుకు శ్రీనివాస్ పాల్గొన్నారు.
BHNG: తండ్రి చనిపోయిన దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని ఓ విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. మోత్కూర్కు చెందిన ఉపాధ్యాయుడు కూరెళ్ళ ఎల్లయ్య శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. పదవ తరగతి చదువుతున్న అతని కుమారుడు కూరెళ్ళ హర్షవర్ధన్, తండ్రి మరణంతో దుఃఖంలో మునిగిపోయిన కన్నీళ్ళను దిగమింగుకుని పరీక్ష రాయడం చూపరులను కలచివేసింది.
VKB: మోమిన్పేట మండల పరిధిలోని కొత్తగడి సమీపంలో శనివారం ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. మోమిన్పేట వెళ్తున్న ఆటో, వికారాబాద్ నుంచి వస్తున్న బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న సురేష్ కాలు విరిగి తీవ్రంగా గాయపడగా, ఆటో డ్రైవర్ స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన ప్రయాణికులు 108లో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.