WGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జనగణన-2027పై అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద శుక్రవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జనాభా లెక్కల సేకరణ ప్రభుత్వ పథకాల అమలుకు, దేశాభివృద్ధికి దిక్సూచి వంటిదని పేర్కొన్నారు. దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.