కామారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్టీసీ విద్యార్థులకు అదనపు సౌకర్యాన్ని కల్పించింది. ఏప్రిల్ 7 వరకు జరిగే ఈ పరీక్షల సమయంలో విద్యార్థులు ఎక్కడ చేయి ఎత్తినా బస్సులు ఆపి, వారిని పరీక్షా కేంద్రాల వద్ద దించాలని డ్రైవర్లు, కండక్టర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.