AP: రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి పంటలపై అవగాహన కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం అన్నం తినేవారు తగ్గిపోతున్నారని.. రైతులు గమనించాలని సూచించారు. డిమాండ్ ఆధారిత పంటలు వేసేలా రైతులను ప్రోత్సహిస్తామని చెప్పారు. నూజివీడు మామిడికి, అరకు కాఫీకి, గుంటూరు మిరపకు చాలా ప్రసిద్ధి అని వెల్లడించారు. ఏలూరు సమీపంలో 500 ఎకరాల్లో కోకో సిటీని తెస్తున్నట్లు పేర్కొన్నారు.