TPT: నాయుడుపేట సీఎస్ తేజ్ థియేటర్ సెంటర్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుప్పారెడ్డిపాలెం గ్రామానికి చెందిన వేగుంట సాయికుమార్ (27) మృతి చెందాడు. బైక్ను అకస్మాత్తుగా అడ్డుగా వచ్చిన మహీంద్రా తుఫాన్ క్రాస్ చేయడంతో ఆయన బైక్ నియంత్రణ కోల్పోయి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయికుమార్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.