కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ నవీన్ ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా LPG సిలిండర్ల సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాత, పట్టణ ప్రాంతాల్లో 30 రోజుల తర్వాత మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలన్నారు.