ప్రకాశం: కొండపి(మం) కే. ఉప్పలపాడు జడ్పీహెచ్ పాఠశాలలో జరుగుతున్న అక్షరాంధ్ర పరీక్ష కేంద్రాలను ఎంపీడీవో రామాంజనేయులు ఆదివారం పరిశీలించారు. ఇటీవల కాలంలో నిరక్షరాస్యల్ని అక్షరాశులు చేయాలన్న ఉద్దేశంతో స్వచ్ఛందంగా అక్షరాభ్యాసకులు గ్రామాల్లో ముందుకు వచ్చారన్నారు. అక్షరాలు నేర్చుకున్న వారికి పరీక్షలు ఈ రోజు నిర్వహించారు. ఈ పరీక్ష కేంద్రాలను ఎంపీడీవో తనిఖీ చేసారు.