AP: రాజధాని పేరుతో కూటమి డ్రామాలు ఆడుతోందని, అమరావతి టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయని YCP నేత మల్లాది విష్ణు ఆరోపించారు. అనుకూలమైనవారికే భూములు కట్టబెట్టారని, ఆర్థిక క్రమశిక్షణ పాటించట్లేదని పేర్కొన్నారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని, అందుకే YCP సభ్యులు హాజరుకాలేదన్నారు. అమరావతిపై తీర్మానం మండలిలోనూ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.