VZM: రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. బొబ్బిలిలో శుక్రవారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ మూడో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 2,27,700 మంది రైతు కుటుంబాలకు రూ.127.63 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నట్లు పేర్కొన్నారు.