కృష్ణా: నియోజకవర్గంలో రైతులకు రూ.57.591 కోట్లు లబ్ది చేకూరినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం అవనిగడ్డ రెవిన్యూ హాలులో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ మూడవ విడత సభ జరిగింది. రైతులతో కలిసి నియోజకవర్గంలో 30,316 మంది రైతులకు రూ.17.05 కోట్లు లబ్ది చెక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు.