MDK: చేగుంట మండలం జైత్రం తండాలో నూతనంగా గ్రామపంచాయతీ భవనం, మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ నిర్వహించారు. ఈజీఎస్ పథకం కింద నిధులు మంజూరు కాగా గ్రామ సర్పంచ్ ధరావత్ సుభాష్ నాయక్ భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఉప సర్పంచ్ రాజేందర్, వార్డు సభ్యులు మోహన్, శోభ లౌడియా లాలీ, గణేష్, స్వప్న గ్రామ కార్యదర్శి సుధాకర్ పాల్గొన్నారు.