ADB: ఆదిలాబాద్ పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెదిరింపులకు పాల్పడిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు తెలిపారు. ఆర్కే కోపరేటివ్ సొసైటీ ఛైర్మన్ కొండూరి రాకేందర్, సొసైటీ మేనేజర్గా రాగం రమేష్లను కొంతమంది వ్యక్తులు బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.